Tragedy: విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. భార్యాభర్తల మధ్య ఘర్షణతో మనస్తాపం చెందిన భార్య పిల్లలతో పాటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దంపతులు విక్రమ్, వేముల నాగరాణి(30)కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం భర్త విక్రమ్తో ఘర్షణ పడిన నాగరాణి తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయింది.
Read Also: IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు..
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
తన ముగ్గురు పిల్లలతో కలిసి వెలుగల్లు సమీపంలోని గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గండిమడుగు ఒడ్డున చెప్పులు, సెల్ ఫోన్ను చూసి నాగరాణి బంధువులు గుర్తించారు. గండిమడుగు నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను బంధువులు, పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనలో నాగరాణి(30), తన ముగ్గురు పిల్లలు నవ్యశ్రీ(10), దినేష్(6), జాహ్నవి (3)లు మృతి చెందారు. కుటుంబకలహాలతోనే ఆమె తన పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగరాణి, ఆమె భర్త విక్రమ్కు మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగరాణి తన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!