IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్లను కేవలం పేటియం, సంబంధిత టీం వెబ్సైట్ లో తప్పించి ఆన్లైన్లో ఎక్కడ దొరకట్లేదు. దింతో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ టికెట్ల రూపంలో అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. మన హైదరాబాద్ మహానగరంలో జరిగే మ్యాచ్లకైతే అభిమానులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడంతో టికెట్స్ డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై విమర్శల వెల్లువలు వస్తున్నాయి.
Also read: DC vs SRH: నేడు సన్రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ..
Also Read
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ఏప్రిల్ 25 ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తడపడనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి హైదరాబాద్ కు చెందిన ఐటీ వ్యక్తులు ఓ పక్క ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఒక టికెట్ 10000 నుంచి 15000 రూపాయల వరకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సమాచారాన్ని కొందరు పోలీసులకు తెలపడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అలా పోలీసులు రైడ్ చేసిన తర్వాత కేసులో ముగ్గురి ఐటి ఉద్యోగులను అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలోని ఇస్నాపూర్ చెందిన మధుబాబు, సైనిక్ పురి డిఫెన్స్ కాలనీకి చెందిన మాధ్యూ రోడ్రిక్స్, కొండాపూర్కి చెందిన ఎలంగోవర్ అందరూ కలిసి టికెట్లను బ్లాక్ లో అమ్మడం మొదలుపెట్టారు.
Also read: CM Revanth Reddy: నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
ఇలా ఒక్కొక్క టికెట్ డిమాండ్ ను బట్టి పదివేల రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. వీరి నుంచి సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు 15 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వాటిని ఎవరెవరికి అమ్మారు.. అసలు టికెట్స్ వారికీ ఎక్కడి నుంచి వచ్చాయి లాంటి విషయాలను లోతుగా కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి డబ్బు అత్యాశకు పోయి అడ్డంగా బుక్కయ్యారు ఐటి ఉద్యోగులు.
తాజావార్తలు
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!