Tragedy: విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. భార్యాభర్తల మధ్య ఘర్షణతో మనస్తాపం చెందిన భార్య పిల్లలతో పాటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దంపతులు విక్రమ్, వేముల నాగరాణి(30)కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం భర్త విక్రమ్తో ఘర్షణ పడిన నాగరాణి తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయింది.
Read Also: IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తన ముగ్గురు పిల్లలతో కలిసి వెలుగల్లు సమీపంలోని గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గండిమడుగు ఒడ్డున చెప్పులు, సెల్ ఫోన్ను చూసి నాగరాణి బంధువులు గుర్తించారు. గండిమడుగు నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను బంధువులు, పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనలో నాగరాణి(30), తన ముగ్గురు పిల్లలు నవ్యశ్రీ(10), దినేష్(6), జాహ్నవి (3)లు మృతి చెందారు. కుటుంబకలహాలతోనే ఆమె తన పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగరాణి, ఆమె భర్త విక్రమ్కు మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగరాణి తన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!