Crime News: బావతో కలిసి పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. నెల రోజుల తర్వాత ఇద్దరు మృతి
- యూపీలోని బిజ్నోర్లో విషాదం
- అక్రమ సంబంధం కారణంగా బావ.. మరదలు ఆత్మహత్య
- కొంతకాలం క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన ఇరువురు
- రాఖీ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బిజ్నోర్లో విషాదం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా బావ, మరదలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో.. కొంతకాలం క్రితం వీరు ఇంట్లో నుంచి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాఖీ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. వరుసకు బావ అయ్యే డేవిడ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఎక్కడ తమ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా.. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది.. దీంతో కోపంతో ఉన్న కుటుంబ సభ్యులు, పారిపోయిన డేవిడ్, రాఖీలను తిట్టేవారు.
Siddaramaiah: ఏపీ, తమిళనాడులో కర్ణాటక పరిస్థితి కనిపించదు.. “కన్నడ” ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఈ క్రమంలో విసిగిపోయిన డేవిడ్, రాఖీలు చనిపోదామని నిర్ణయించుకున్నారు. జూన్ 19న నజీబాబాద్ లోని గర్మల్ పూర్ ఫ్లైఓవర్ సమీపంలో పాయిజన్ తీసుకున్నారు. కాగా.. వారు అపస్మారక స్థితిలో ఉండటం, ఇద్దరి నోటి నుంచి నురగ రావడం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిద్దరినీ సమీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే.. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బిజ్నోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే లోపే డేవిడ్, రాఖీలు చనిపోయారు.
EVM: తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లోని 8 లోక్సభ స్థానాలకు చెందిన ఈవీఎంల తనిఖీ.. ఎందుకో తెలుసా?
మృతదేహాలను పరిశీలించగా.. వారి వద్ద ఆధార్ కార్డులు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఇద్దరిని గుర్తించారు. దీంతో.. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే.. రాఖీ కుటుంబ సభ్యులు మాత్రం మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. తమ గౌరవాన్ని పాడు చేసిన అమ్మాయి.. తమకు సంబంధ లేదని అన్నారు. నెల రోజుల క్రితమే ఆమె చనిపోయిందని తెలిపారు. ఈ క్రమంలో.. వారిద్దరి మృతదేహాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు పంపించారు. ఇదిలా ఉంటే.. డేవిడ్ బంధువు అనిల్ తో ఏడేళ్ల క్రితం రాఖీతో ప్రేమ వివాహం జరిగింది. మొదట్లో ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించగా.. వారిద్దరూ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతం.. వారిని కాపాడిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాగా.. వీరికి ఏడేళ్లు, ఐదు సంవత్సరాల కొడుకులు ఉన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?