Crime News: బావతో కలిసి పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. నెల రోజుల తర్వాత ఇద్దరు మృతి
- యూపీలోని బిజ్నోర్లో విషాదం
- అక్రమ సంబంధం కారణంగా బావ.. మరదలు ఆత్మహత్య
- కొంతకాలం క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన ఇరువురు
- రాఖీ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బిజ్నోర్లో విషాదం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా బావ, మరదలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో.. కొంతకాలం క్రితం వీరు ఇంట్లో నుంచి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాఖీ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. వరుసకు బావ అయ్యే డేవిడ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఎక్కడ తమ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా.. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది.. దీంతో కోపంతో ఉన్న కుటుంబ సభ్యులు, పారిపోయిన డేవిడ్, రాఖీలను తిట్టేవారు.
Siddaramaiah: ఏపీ, తమిళనాడులో కర్ణాటక పరిస్థితి కనిపించదు.. “కన్నడ” ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఈ క్రమంలో విసిగిపోయిన డేవిడ్, రాఖీలు చనిపోదామని నిర్ణయించుకున్నారు. జూన్ 19న నజీబాబాద్ లోని గర్మల్ పూర్ ఫ్లైఓవర్ సమీపంలో పాయిజన్ తీసుకున్నారు. కాగా.. వారు అపస్మారక స్థితిలో ఉండటం, ఇద్దరి నోటి నుంచి నురగ రావడం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిద్దరినీ సమీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే.. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బిజ్నోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే లోపే డేవిడ్, రాఖీలు చనిపోయారు.
EVM: తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లోని 8 లోక్సభ స్థానాలకు చెందిన ఈవీఎంల తనిఖీ.. ఎందుకో తెలుసా?
మృతదేహాలను పరిశీలించగా.. వారి వద్ద ఆధార్ కార్డులు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఇద్దరిని గుర్తించారు. దీంతో.. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే.. రాఖీ కుటుంబ సభ్యులు మాత్రం మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. తమ గౌరవాన్ని పాడు చేసిన అమ్మాయి.. తమకు సంబంధ లేదని అన్నారు. నెల రోజుల క్రితమే ఆమె చనిపోయిందని తెలిపారు. ఈ క్రమంలో.. వారిద్దరి మృతదేహాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు పంపించారు. ఇదిలా ఉంటే.. డేవిడ్ బంధువు అనిల్ తో ఏడేళ్ల క్రితం రాఖీతో ప్రేమ వివాహం జరిగింది. మొదట్లో ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించగా.. వారిద్దరూ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతం.. వారిని కాపాడిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాగా.. వీరికి ఏడేళ్లు, ఐదు సంవత్సరాల కొడుకులు ఉన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!