Dubbak Murder Case : 80 రోజుల పసికందును హత్య చేసిన తల్లి.. విచారణలో షాకింగ్ విషయాలు..!
- 80 రోజుల కొడుకును చంపిన తల్లి
- పోలీసులు తప్పుదొవ పట్టించిన తల్లి
- విచారణలో వెల్లడైన సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ ప్రేమను మాటల్లో వర్ణించలేం.. నవ మాసాలు మోసి జన్మినిచ్చిన పిల్లల్ని అపురూపంగా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది.. అలాంటి కన్న బిడ్డను తల్లి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు గురువారం వెలికి తీశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కొడుకును అపహరించారని ఆ తల్లి కథ అల్లింది. పోలీసులను సైతం తప్పుదోవ పట్టించింది. చివరికి పోలీసుల ఎదుట తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.
READ MORE: ACB: రూ. 8 లక్షలు డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ టౌన్ ప్లానర్
Also Read
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్ వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగళ్ళ శ్రీమాన్, నంగునూరు మండలం నర్మెట్టకు చెందిన కవితకు మూడు ఏళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. వీరు పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని, అతని అమ్మమ్మ ఊరైన అప్పనపల్లిలో గత రెండు నెలల నుంచి ఉంటున్నారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులకు గురి చేస్తుండటంతో కవిత భర్తతో విడిపోవడానికి సిద్ధపడింది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందును
తప్పిస్తే.. భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది.
READ MORE: SKN : పర్సెంటేజీ కాదు.. టికెట్ ధరలు తగ్గించండి.. ఎస్కేఎన్ కామెంట్స్
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందు దీక్షిత్ కుమార్ను తీసుకెళ్లి గ్రామశివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్లిపోయింది. తన దగ్గర నుంచి ఇద్దరు ముసుగు వేసుకొని వచ్చిన దుండగులు బాబును ఎత్తుకెళ్లారని చెప్పి, అందరిని తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి తల్లే హత్య చేసినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!