జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. బిల్లింగ్ అనుమతికి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు పట్టుబడ్డారు. విటల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విటల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి ఎనిమిది లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. నాలుగు లక్షలు తీసుకొని మరో నాలుగు లక్షలు డిమాండ్ చేయడంతో వెంకట్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
READ MORE: Imran Khan: భారత్ మరో దాడి చేస్తుంది.. పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
కాగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకునే వారిపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటుంది. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వారిపై నిఘా పెట్టి ఆధారాలతో సహా వారిని అరెస్ట్ చేస్తుంది. ఎవరైనా అధికారులు లంచం తీసుకునేటప్పుడు దొరికితే అంతే సంగతులు. వారికి సంబంధించిన డేటా మొత్తం తీసి వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. లంచాలు తీసుకున్న అధికారి ఆదాయం ఎంత? ఆదాయానికి మించి ఎన్ని ఆస్తులు ఉన్నాయని తెలుసుకొని కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు ఆస్తులు ఎక్కడ ఉంటే అక్కడ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
READ MORE: Paritala Sriram: పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు.. నాలో ఉన్న ఒరిజనల్ అలానే ఉంది..!