Drones: డ్రోన్ల ద్వారా ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ.. కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పరిధిలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించనుంది. ఈ డ్రోన్ల సహాయంతో వర్క్సైట్లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించనుంది. తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(SOP) గైడ్ లైన్ లో ఈ విషయాలను ప్రస్తావించారు. డ్రోన్లతో ఉపాధి పనులు జరుగుతున్నప్పుడు.. లైవ్ సర్వే, పూర్తయిన పనుల తనిఖీ, ఇంపాక్ట్ అసెస్మెంట్, ఫిర్యాదులు వచ్చిన తర్వాత పనుల ప్రత్యేక తనిఖీ వంటివి తెలుసుకోనున్నారు.
Read Also: Commando Suicide: ఏకే-47 రైఫిల్తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య.. కారణమేంటంటే?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
MNREGAలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు నిరంతరం అందుతున్నాయని గ్రామీణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కూలీల స్థానంలో యంత్రాల వినియోగం, ఏ పని చేయకుండానే కొంత మంది జీతాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలను సేకరించడంలో డ్రోన్లు సహాయపడతాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి తమ వాటాగా సమకూర్చే ఫండ్స్ నుంచి డ్రోన్లను కొనాలని కేంద్ర సర్కారు నిర్దేశించింది.
Read Also: Chandrababu: వైసీపీవి దొంగ సర్వేలు.. వారికి 14 శాతం ఓట్లు కూడా రావు..!
మరోవైపు డ్రోన్లను కొనలేని పరిస్థితుల్లో.. వాటిని లీజుకు లేదా అద్దెకు ఇచ్చే సంస్థల సేవలను వినియోగించుకోవాలని గ్రామీణ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ డ్రోన్లు తీసే వీడియోలు, ఫోటోలను స్టోర్ చేయడానికి, డేటా విశ్లేషణ, రిపోర్టింగ్ ప్రయోజనాల కోసం కేంద్రీకృత డ్యాష్బోర్డ్ను రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. ఉపాధి హామీ కూలీల పనులను పర్యవేక్షిండానికి డోన్లతో చేస్తున్న ప్రయత్నం రెండోది కాగా.. గతంలో కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఆధారిత అప్లికేషన్ సహాయంతో కూలీల హాజరును తప్పనిసరి చేసింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!