Mohsin Naqvi-BCCI: బీసీసీఐ హెచ్చరిక ఇ-మెయిల్.. మొహ్సిన్ నఖ్వీ కీలక ప్రకటన!
- ఆసియా కప్ 2025 ట్రోఫీపై ప్రతిష్టంభన
- నఖ్వీకి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ
- తగ్గేదేలే అంటున్న పీసీబీ ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025 ట్రోఫీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫైనల్ ముగిసి 20 రోజలు దాటినా.. ట్రోఫీ, మెడల్స్ ఛాంపియన్ భారత జట్టు చేతికి రాలేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ. తాజాగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నుంచి హెచ్చరిక ఇ-మెయిల్ వెళ్లినా.. నఖ్వీ తగ్గేదేలే అంటున్నాడు. ఆసియా కప్ 2025 ట్రోఫీని తన చేతుల మీదుగానే టీమిండియాకు ఇస్తా అని మరోసారి కుండబద్దలు కొట్టాడు.
బీసీసీఐ హెచ్చరిక ఇ-మెయిల్పై ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ స్పందించాడు. ‘ఆసియా కప్ 2025 ట్రోఫీ ముమ్మాటికీ భారతదేశానికే చెందుతుంది. నేను ఏసీసీ అధ్యక్షుడిని, నా చేతుల మీదుగానే ట్రోఫీని టీమిండియాకు అందిస్తా. భారతదేశంలో ఒక ప్రెజెంటేషన్ వేడుకను నిర్వహించుకోండి. సరిహద్దులు దాటి ట్రోఫీని పంపాలని మాత్రం ఆశించొద్దు. నా నుంచి నేరుగా ట్రోఫీని తీసుకోవడానికి ఒక భారత జట్టు ఆటగాడిని పంపాలని బీసీసీఐమీ కోరుతున్నా’ అని మోహ్సిన్ నఖ్వీ పేర్కొన్నాడు. మొత్తానికి ఆసియా కప్ 2025 ట్రోఫీని ఇస్తా అంటున్న నఖ్వీ.. టీమిండియా ప్లేయర్ ఒక్కరైనా వచ్చి తీసుకోవాలని కండిషన్ పెట్టాడు. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందింస్తుందో చూడాలి.
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
- 9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
Also Read: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. Realme GT 8 Pro ధర, ఫీచర్స్ ఇలా!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025 ఛాంపియన్ అయిన భారత్.. ఏసీసీ చీఫ్, పీసీబీ ఛైర్మన్ అయిన మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ తీసుకొనేందుకు నిరాకరించింది. 40 నిముషాలు వెయిట్ చేసిన నఖ్వీ.. ట్రోఫీ, మెడల్స్ను తనతో పాటు దుబాయ్లోని ఒక హోటల్కు తీసుకెళ్లిపోయాడు. ఆపై ఏసీసీ కార్యాలయానికి ట్రోఫీని తీసుకెళ్లిన అతడు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రావాలని కండిషన్ పెట్టాడు. నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై ఏసీసీ ఏజీఎం సమావేశంలో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా అధికారిక ఇ-మెయిల్ ద్వారా నఖ్వికి వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీని వెంటనే అప్పగించాలని, లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని బీసీసీఐ హెచ్చరించింది. అయినా కూడా నఖ్వీ వెనక్కి తగ్గడం లేదు.
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!