Mohammed Shami: నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దు?.. సెలెక్టర్లపై మహ్మద్ షమీ విమర్శలు
- నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దు
- సెలెక్టర్లపై మహ్మద్ షమీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రత్యర్థి జట్లకు తన మెరుపు బౌలింగ్ తో చెమటలు పట్టిస్తుంటాడు. కీలక మ్యాచుల్లో అద్భుతమైన బౌలింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీ రోల్ ప్లే చేస్తాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల మ్యాచ్లకు షమీ ఎంపిక కాలేదు. కానీ, అక్టోబర్ 15న ప్రారంభమయ్యే 2025-26 రంజీ ట్రోఫీ సీజన్ కోసం బెంగాల్ జట్టులో షమీని తీసుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తారని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో షమీ టీమిండియా సెలెక్టర్లపై విమర్శలు గుప్పించారు. నేను రంజీలు ఆడగలిగితే.. వన్డేలు ఎందుకు ఆడొద్దని ఫైర్ అయ్యారు.
Also Read:Supreme Court : మిస్సింగ్ పిల్లల కోసం ప్రత్యేక చర్యలు అవసరం
Also Read
ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే, టి20 జట్ల నుంచి తొలగించిన తర్వాత, షమీ తాను పూర్తిగా ఫిట్గా ఉన్నానని, ఏ ఫార్మాట్లోనైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. జట్టు యాజమాన్యం తన ఫిట్నెస్ గురించి తనతో చర్చించలేదని షమీ చెప్పాడు. నాలుగు రోజుల రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడగలిగితే, తాను 50 ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలనని అతను స్పష్టం చేశాడు. మరోవైపు, షమీని తప్పించడానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వేరే కారణం చెప్పారు.
Also Read:E20 Petrol: E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!
గత కొన్ని సంవత్సరాలుగా షమీ పెద్దగా క్రికెట్ ఆడలేదని, ఎంపిక కోసం క్రమం తప్పకుండా మ్యాచ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని అగార్కర్ అన్నారు. షమీ చివరిసారిగా 2025లో న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తరపున ఆడాడు. అతను ఆ టోర్నమెంట్ను బంగ్లాదేశ్పై ఐదు వికెట్లు పడగొట్టడంతో ప్రారంభించాడు, కానీ రెండు మ్యాచ్ల్లో వికెట్ తీసుకోలేదు. ఆ తర్వాత సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై మూడు వికెట్లు, ఫైనల్లో ఒక వికెట్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Bandi Bhageerath :బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!