PM Modi : 75ఏళ్ల రాజ్యాంగ ప్రయాణంపై ప్రసంగించిన మోడీ.. దద్దరిల్లిన పార్లమెంట్!
- కొనసాగుతున్న శీతాకాల సమావేశాలు
- రాజ్యాంగంపై చర్చ
- పార్లమెంట్లో ప్రసంగించిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి సభ్యులు ఘనస్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో పార్లమెంట్ భవనం దద్దరిల్లింది. రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో మోడీ ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన గణతంత్ర దేశం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దాని సంస్కృతిలో భాగమన్నారు. “భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఇది మన సంస్కృతి, సంప్రదాయలతో నిండిపోయింది. 75 ఏళ్లలో భారతదేశం అసాధారణ విజయాలు సాధించింది. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకు సాగింది. ఈ శక్తిని ప్రజాస్వామ్యం మనకు అందించింది. మన ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటి చెప్పుకోవాలి. ఈ రోజు పండుగ జరుపుకోవాలి.” అని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
READ MORE: CM Chandrababu: డోకిపర్రు శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు పూజలు
Also Read
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
అంతే కాకుండా.. రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్, బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారతదేశం యొక్క ప్రజాస్వామ్య ప్రయాణం, దాని విజయాలు అసాధారణమైనవిగా ప్రధాని అభివర్ణించారు. భారతదేశ ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయడంలో రాజర్షి టాండన్, అంబేడ్కర్ వంటి మహానుభావులు ముఖ్యమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య యాత్రను దేశ పౌరులు సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొచ్చారు. నారీ శక్తి వందన్ చట్టాన్ని ప్రస్తావిస్తూ, మహిళా సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా తెలిపారు. రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో ఈ చట్టం మైలురాయిగా నిలుస్తుందన్నారు. భారతదేశం మొదటి నుంచి మహిళలకు ఓటు హక్కు కల్పించింది. నేడు.. పార్లమెంటులో కూడా మహిళా ఎంపీల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. నారీ శక్తి వందన్ చట్టం ఈ దిశలో ఒక చారిత్రాత్మక అడుగు అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!