MLC Kavitha: మూసీ ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
- మూసీ ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
- అసెంబ్లీ మీడియా పాయింట్లో చేసిన ప్రెస్ మీట్
- పూర్తి వివరాలు ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ మీడియా పాయింట్లో చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “మేము మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని, నిన్న రాత్రి జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ, సెప్టెంబర్ 2024లో ప్రపంచ బ్యాంకు నుంచి ఋణం అడిగినట్టుగా నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని కవిత అన్నారు.
Also Read: Vemulawada: దారుణ హత్య.. రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
- Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
- India vs England: "బుడ్డోడా నీ ప్రతిభకు సలాం".. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
అసెంబ్లీలో డీపీఆర్ లేనట్టు చెప్పిన మంత్రి, సెప్టెంబర్ 19 న ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉందని చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఎవరి లాభం కోసం ఇది జరుగుతుందో ప్రజలకు స్పష్టత ఇవ్వండని ఆమె చెప్పారు. కవిత మరింతగా మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకును కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదని.. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేసిందని ఆవిడ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు చెప్పేది వేర్వేరుగా ఉందని ఆమె విమర్శించారు.
Also Read: Raithu Bheema: రైతు బీమా కుంభకోణం.. చావు నాటకం బట్టబయలు
కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 14 వేల కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి మూసీ కోసం అడిగారని ఆవిడా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి వేర్వేరు వాదనలు చెప్తోందని కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోంది. మూసీ ప్రాజెక్టు పై అబద్ధాలు ఆడుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. మూసీ పేరు మీద పేదల ఇండ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేస్తున్నట్లు కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచేలా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
-
Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
-
Isakapatnam OTT: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్లోకి ‘ఇసకపట్నం’!
-
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
-
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!