Raithu Bheema: రైతు బీమా కుంభకోణం.. చావు నాటకం బట్టబయలు
- రైతు బీమా కుంభకోణం..
- మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో
- చావు నాటకం బట్టబయలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raithu Bheema: మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం ఆడారు. ఈ కుంభకోణానికి మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటేష్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. 2021లో శ్రీను చనిపోయినట్లు, 2023లో మల్లేశం చనిపోయినట్లు అధికారులను నమ్మించి గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు.
Also Read: Chalo Raj Bhavan: టీపీసీసీ ఆధ్వర్యంలో “చలో రాజ్భవన్”.. నిరసనల్లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం
Also Read
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
- Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
ఆ తర్వాత రైతుల భార్యలు అధికారుల ముందూ నాటకం ఆడటానికి సిద్ధమయ్యారు. చావు నాటకంలో ఎవరికీ అనుమానం రాకుండా తమ బొట్టును తీసేసి, గాజులను తీసేసి చనిపోయిన వారి భార్యలుగా నటించారు. గ్రామస్థుల సాక్ష్యాన్ని కూడా సమకూర్చడంలో వెంకటేష్ చాకచక్యంగా వ్యవహరించాడు. దాంతో డెత్ సర్టిఫికెట్ ఆధారంగా ఇద్దరు రైతుల పేరుపై దరఖాస్తు చేసి పది లక్షల రూపాయల బీమా సొమ్ము పొందారు. అందిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని వెంకటేష్ తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై ఎటువంటి అనుమానాలు రాకుండా కొన్నాళ్లపాటు మాయమైపోయారు.
Also Read: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ప్రాణం బలి
అయితే, తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా భర్తలు చనిపోయారని చెప్పిన భార్యలపై గ్రామస్థులు అనుమానించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దానితో గ్రామానికి చేరుకున్న పోలీసుల విచారణ మొదలయ్యేలోపే శ్రీను, మల్లేశం కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసుకుని పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు విచారణ ముమ్మరం చేసి, మోసానికి పాల్పడిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో దారుణమైన వ్యవహారాలకు నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ బీమా పథకాలపై ఎటువంటి లోపాలు లేకుండా మరింత నిఘా అవసరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్లోకి కిరణ్ అబ్బవరం సినిమా
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?