Jeevan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ లక్ష్యాలని నీరు కార్చారు.. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు.. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసిన సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులలోనే విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని కొనసాగింపు నిర్ణయం, మహిళలకి అర్థిక వెసులు బాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు.. ఉచిత ప్రయాణంపై విద్యార్థిలకి, మహిళ ఉద్యోగులకి లబ్ది చేకూరింది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు తక్షణమే తొలగించాలనడం హర్షనీయం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ గెలవాలని అభిమాని ఏం చేశాడో తెలుసా?
Also Read
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఆదాయశాఖగా మారింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మద్యాన్ని అదాయ మార్గంగా ఎంచుకొని ప్రజలను మద్యానికి బానిసగా చేసింది.. ప్రతి గ్రామంలో పదికి పైగా బెల్ట్ షాపులు ఉండేవి.. బెల్ట్ షాపుల మూసి వేయటానికి తక్షణమే అదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాను.. కౌలు రైతుని గుర్తించడం కష్టమే.. ముఖ్యమంత్రి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో వణుకు పుడుతుంది అని ఆయన మండిపడ్డారు. దళిత బంధు కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం వచ్చిందని దళితులు గ్రహించారు.. ఈసారి ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు.. ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మీతో పాటుగా తులం బంగారం ఇవ్వడం సాధ్యమేనని జీవన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: BRS Leaders: ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతుంది.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులు
హుస్నాబాద్ ని సిద్దిపేటలో కలపడం మూర్ఖత్వం చర్య అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. హుస్నాబాద్ ని తిరిగి కరీంనగర్ లో కలపాలన్న డిమాండ్ పరిష్కారం అవుతుంది.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయ్యింది.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండనుంది.. అనుమతులు లేకుండా గ్రామాలలో అక్రమంగా నిర్వహించబడుతున్న బెల్ట్ షాపులని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!