Jeevan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ లక్ష్యాలని నీరు కార్చారు.. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు.. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసిన సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులలోనే విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని కొనసాగింపు నిర్ణయం, మహిళలకి అర్థిక వెసులు బాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు.. ఉచిత ప్రయాణంపై విద్యార్థిలకి, మహిళ ఉద్యోగులకి లబ్ది చేకూరింది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు తక్షణమే తొలగించాలనడం హర్షనీయం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ గెలవాలని అభిమాని ఏం చేశాడో తెలుసా?
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఆదాయశాఖగా మారింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మద్యాన్ని అదాయ మార్గంగా ఎంచుకొని ప్రజలను మద్యానికి బానిసగా చేసింది.. ప్రతి గ్రామంలో పదికి పైగా బెల్ట్ షాపులు ఉండేవి.. బెల్ట్ షాపుల మూసి వేయటానికి తక్షణమే అదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాను.. కౌలు రైతుని గుర్తించడం కష్టమే.. ముఖ్యమంత్రి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో వణుకు పుడుతుంది అని ఆయన మండిపడ్డారు. దళిత బంధు కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం వచ్చిందని దళితులు గ్రహించారు.. ఈసారి ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు.. ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మీతో పాటుగా తులం బంగారం ఇవ్వడం సాధ్యమేనని జీవన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: BRS Leaders: ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతుంది.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులు
హుస్నాబాద్ ని సిద్దిపేటలో కలపడం మూర్ఖత్వం చర్య అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. హుస్నాబాద్ ని తిరిగి కరీంనగర్ లో కలపాలన్న డిమాండ్ పరిష్కారం అవుతుంది.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయ్యింది.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండనుంది.. అనుమతులు లేకుండా గ్రామాలలో అక్రమంగా నిర్వహించబడుతున్న బెల్ట్ షాపులని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు.
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!