Nandamuri Balakrishna: అంబటి నన్ను రెచ్చగొట్టాడు.. రా చూసుకుందాం అన్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఓ దశలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీసాలు మిలేయడం, తొడగట్టడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.. ఆ తర్వాత టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.. ఇక, మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ.. అంబటి రాంబాబు సభలో మీసం మేలేసి తొడ కొట్టాడు.. నా వృత్తిని అవమానించాడు. సినిమాల్లో చూసుకోమన్నాడు.. అంబటి నన్ను రెచ్చగొట్టాడు అంటూ ఫైర్ అయ్యారు బాలయ్య.. రా చూసుకుందామని అంబటి అన్నాడు.. నేనూ రా చూసుకుందామన్నాను.. సినిమా ఇండస్ట్రీలో నాలాగా ధైర్యంగా భయపడకుండా మాట్లాడే వారు కొందరే ఉంటారని.. మిగిలిన వారిలాగా నేనూ సైలెంటుగా ఉంటానని అనుకున్నారు.. నేను ముందుకొచ్చేసరికి బిత్తరపోయారని వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ.
రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన జరుగుతోందని విమర్శించారు బాలయ్య.. సంక్షేమం-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబేనన్న ఆయన.. చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్.. చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదని.. కక్ష సాధింపు తప్ప.. సీఎం జగన్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఏ చట్ట ప్రకారం చంద్రబాబు అరెస్ట్ జరిగిందోనని ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని.. అభివృద్ధి – సంక్షేమం చేసిన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా..? అని అందరూ చర్చించుకుంటున్నారని వెల్లడించారు. స్కిల్ కేసులో నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు? అని నిలదీశారు బాలయ్య.. స్కిల్ కేసులో షెల్ కంపెనిలే లేవని తెలిపారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు.. టీడీపీ ఇలాంటివెన్నో చూచిందన్నారు బాలకృష్ణ.. జైల్లో చంద్రబాబు ధైర్యంగానే ఉన్నారు.. కానీ, రాష్ట్రం గురించి బాధపడుతున్నారని తెలిపారు. ఇక, వైజాగ్కు జూనియర్ ఆర్టిస్టులను తెచ్చి వైసీపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు కేసును విత్ డ్రా చేసుకోవాలని మేం రిక్వెస్ట్ చేశాం.. చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని కోరాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అసెంబ్లీలో కోరామని తెలిపారు.. ఓ అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజమవుతుందనే భ్రమలో వైసీపీ ఉందని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం కూడా రోడ్ల మీదకు వస్తారని హెచ్చరించారు. గంజాయితో యువకులను నిర్వీర్యం చేసేస్తున్నారు.. రోమ్ తగులపడితే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ఉంది జగన్ తీరు అంటూ దుయ్యబట్టారు నందమూరి బాలకృష్ణ.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!