AP Assembly: అసెంబ్లీ వైపు చూడని ఎమ్మెల్యేలు..! భారీగా తగ్గిన హాజరు..
- ఏపీ అసెంబ్లీకి భారీగా తగ్గుతోన్న ఎమ్మెల్యేల హాజరుశాతం..
- ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా పెరగని హాజరు శాతం..
- ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండానే సభ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు సభకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. గవర్నర్ ప్రసంగిస్తుండగానే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే.. అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేసి వెళ్లిపోయారు.. ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే.. సభలో 164 మంది సభ్యులు ఉండాలి.. కానీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు శాతం భారీగా తగ్గిపోయింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా.. అసెంబ్లీకి రావడం లేదు ఎమ్మెల్యేలు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటు వరకు బిజీగా ఉన్నారని భావించినా.. ఆ తర్వాత కూడా హాజరు శాతం తగ్గింది.. ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండా సభ నడుస్తోంది..
Read Also: Kannappa : ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో షేర్ చేసిన విష్ణు
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
వైసీపీకి చెందిన 11 మందిని మినహాయిస్తే మొత్తంగా 164 మంది సభ్యులు ఉండగా.. ఎలాంటి పరిస్థితి అయినా కూడా 100 మంది తగ్గకుండా హాజరు కావాల్సిన పరిస్థితి.. కానీ, ఆ సంఖ్య భారీగా తగ్గిపోయింది.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలు మరింత ఎక్కువగా ఫోకస్ అవుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్ష సభ్యులు సభకు వస్తే.. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు.. అది కాకుండా.. ఆయా నియోజకవర్గాల సభ్యులు వచ్చినా.. తమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను లేవనెత్తవచ్చు.. కానీ, క్రమంగా సభ్యుల హాజరు శాతం తగ్గడం ఇప్పుడు చర్చగా మారిపోయింది..
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!