Assam: మైనర్పై గ్యాంగ్ రేప్.. యాక్షన్లోకి సీఎం
- అస్సాంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
- బాలిక ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఘటన
- గురువారం సాయంత్రం సమయంలో ఘటన
- స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
- ఈ ఘటనలో నిందితులను వదిలిపెట్టేది లేదు- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మహిళలపై అత్యాచారాలు పాల్పడటం ఆగడం లేదు. ఎక్కడో చోట కామాంధులు అమ్మాయిలపై క్రూరత్వానికి పాల్పడుతున్నారు. కోల్కతా ఘటన మరువక ముందే అస్సాంలో మరో అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఉదాంతం చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్ చేశారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడంపై దేశం మొత్తం ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం బద్లాపూర్లోని ఓ పాఠశాలలో అమాయక చిన్నారులపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Parakramam Review: పరాక్రమం సినిమా రివ్యూ
Also Read
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల బాలిక చిరిగిన బట్టలతో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం గురువారం సాయంత్రం ఏడు గంటలకు జరిగింది. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స మరియు వైద్య పరీక్షల కోసం నాగాన్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. బాలిక వాంగ్మూలాన్ని మహిళా పోలీసు రికార్డు చేసిందని నాగావ్ ఎస్పీ స్వప్నిల్ దేకా తెలిపారు. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. కాగా.. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి.. ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. అత్యాచార ఘటన మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని డీజీపీని ఆదేశించారు. ముఖ్యమంత్రి హిమంత ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ‘మైనర్కు సంబంధించిన భయంకరమైన సంఘటన మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని రాశారు’. ఈ ఘటనలో తాము ఎవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని సీఎం బిస్వా శర్మ డీజీపీని ఆదేశించారు.
The horrific incident at Dhing, involving a minor, is a crime against humanity and has struck our collective conscience.
We will NOT SPARE anyone & BRING the perpetrators to JUSTICE. I've directed @DGPAssamPolice to visit the site and ensure swift action against such monsters.
— Himanta Biswa Sarma (@himantabiswa) August 23, 2024
తాజావార్తలు
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!