Andhrapradesh: అంగన్వాడీ సంఘాలతో కొలిక్కిరాని ప్రభుత్వ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొలిక్కిరాలేదు. ఈ చర్చలు విఫలమయ్యాయి. 2024 జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. జీతాల పెంపుపైనే అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు పట్టుబట్టారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి జీతాలు పెంచుతాం అని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎంత పెంచుతారో చెప్పాలని అంగన్వాడీలు ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడే అంకె చెప్పటం కుదరదని సర్కారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్వాడీలు పట్టుబట్టారు. అలా చేస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు. అందుకు ప్రభుత్వం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో అంగన్వాడీల సమ్మె కొనసాగనుంది. ఈ చర్చల గురించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Read Also: Penamaluru Politics: టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బోడే వర్గం!
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
అంగన్వాడీలు సమ్మె ప్రారంభం అయి నెల రోజులు అవుతుందని.. ఇప్పటి వరకు జీఓఎం మూడుసార్లు చర్చలు జరిపామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వారు పెట్టిన 11 డిమాండ్లలో 10 నెరవేరుస్తాం అని చెప్పామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేశామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ గతంలో 50 వేలు ఉండేది.. ఇప్పుడు అంగన్వాడీల వర్కర్లకు లక్షా 20 వేలకు పెంచామని.. హెల్పర్స్కు 20 వేల నుంచి 50 వేలకు పెంచటానికి అంగీకరించామన్నారు. మట్టి ఖర్చుల కింద 5 వేలు ఉంటే 20 వేలు చేయాలని అడిగారని… అంగీకరించామన్నారు. 2019లో ప్రభుత్వం రాగానే జీతాలను రూ. 10, 500 ఉంటే రూ. 11,500 చేశామన్నారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం 2019 మార్చి నెలలో వాళ్ళ జీతాలు పెంచిందన్నారు. అయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే పెంచామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికిప్పుడు పెంచటం సాధ్యం కాదని స్పష్టం చేశామన్నారు. 2024 జులైలో జీతాలు పెంచుతాం అని హామీ ఇచ్చామని సజ్జల పేర్కొన్నారు.
Read Also: TDP: చంద్రబాబు నివాసానికి కృష్ణా జిల్లా నేతలు.. టార్గెట్ కేశినేని నాని!
సర్వీస్ కు సంబంధించిన పలు ఇతర డిమాండ్లను పరిష్కరిస్తాం అని చెప్పామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2014లో అంగన్వాడీల వర్కర్ల జీతం 4,200 రూపాయలు ఉండేదన్నారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎక్కడా దురుసుగా ప్రవర్తించ లేదన్నారు. ప్రభుత్వం పూర్తి సంయమనంతో ఉందని, అందరూ పద్ధతిగా ఉండాలన్నారు. చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారని.. డ్రై రేషన్, అంగన్వాడీ కేంద్రాలు మూత బడటంతో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని సజ్జల తెలిపారు. ఈ పరిస్థితిని ఇంకా కొనసాగించలేమన్నారు. రాజకీయ పార్టీలు వెనుక ఉండి నడిపిస్తున్నారన్న ఆయన.. నిన్నటి నుంచి నోటీసులు ఇవ్వటం ప్రారంభించామన్నారు. నోటీసులో ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరకపోతే కొత్త వారిని నియమించాల్సి వస్తుందన్నారు. “తెగేదాక లాగ వద్దు అని విఙప్తి చేస్తున్నాం. ఇతర పార్టీల భ్రమల్లో పడి మోసపోకండి. ఉద్యోగుల పట్ల మాకు సానుభూతి ఉన్న ప్రభుత్వం మాది. అంగన్వాడీల పట్ల మరింత ఎక్కువ సానుభూతి ఉంది. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరండి. సమ్మె చేస్తే డిమాండ్లు నెరవేరతాయా?? అలా అయితే అందరూ సమ్మె చేస్తారు. 7 లక్షల మందికి పైగా పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చూడాలి కదా.” అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!