Penamaluru Politics: టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బోడే వర్గం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Penamaluru Politics: పెనమలూరు టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి రాక రచ్చ రేపుతోంది. ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిక ఖాయం కావటంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం ఆందోళనకు గురవుతోంది. సీటుకు ఎసరుపెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు జరుగుతుండడంతో టికెట్ రాదేమోననే ఆందోళనలో బోడే ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలుసు పార్థసారధి రాకను బోడే ప్రసాద్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథికి వైసీపీ నుంచి అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో టీడీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన టీడీపీ నుంచి పెనమలూరు టికెట్ను ఆశిస్తున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
పార్ధసారథి పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా వస్తే ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని బోడే ప్రసాద్ కేడర్ స్పష్టం చేసింది. పార్టీలో జరుగుతున్న పరిణీమాలపై అసంతృప్తితో బోడే ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బోడే ప్రసాద్ను బుజ్జగించే పనిలో టీడీపీ పడింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను బోడే ప్రసాద్ ఇంటికి టీడీపీ అధిష్ఠానం పంపించింది. బోడే ప్రసాద్ను కలిసి పార్టీ అన్యాయం చేయదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పినట్లు తెలిసింది.
పెనమలూరులో బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు మనదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఏ నిర్ణయం జరగలేదని.. ఎవరూ ఆగ్రహ ఆవేశాలకు గురికావద్దన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎంటో తెలియకుండా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడటం సరికాదన్నారు. గెలుపు మనదేనని.. పుకార్లు నమ్మవద్దని పార్టీ కేడర్కు బోడే ప్రసాద్ సూచించారు. మీ అందరి సహకారంతో తగ్గేదే లేదన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!