Tummala Nageswara Rao: రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు..
- అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 31 వేలకోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం
- ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద ఏఓ ఉంటారు..
- సమస్యను పరిష్కరించుకోవచ్చు- తుమ్మల నాగేశ్వరరావు
- రాజకీయ పార్టీల ఆత్రుతతో రైతులను ప్రక్కదోవ పట్టిస్తున్నారు- మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రైతులకు రుణమాఫీ అవుతున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులైన రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయనుంది. మొదటగా లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ అయింది. ఈ క్రమంలో.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 31 వేలకోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం అని అన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద ఏఓ ఉంటారు.. సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీల ఆత్రుతతో రైతులను ప్రక్కదోవ పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
Read Also: Cinema Cess: సినీ టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై మోత?
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
మీడియాలో తప్పుడు వార్తలొస్తున్నాయి. కానీ నిజ నిజాలను తెలుసుకొని ప్రసారాలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులను ఆగం చేయకుండా, అయోమయానికి గురి చేయొద్దని సూచించారు. రుణమాఫీకి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది.. ఏ ఒక్క రైతుకు అన్యాయం కానివ్వం అని అన్నారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందొద్దు.. ఇంత మంచి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి, కానీ బురదజల్లే కార్యక్రమం చేయొద్దని సూచించారు. రైతుబందుకు మూటకట్టి పెట్టలేదు గత ప్రభుత్వం.. చెల్లించకుండా ఉంటే తమ ప్రభుత్వం వచ్చాక చెల్లించామని తెలిపారు. అలాగే.. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతులు నమ్మకంగా ఉండండి.. గత ప్రభుత్వం చేసిన మోసం వల్ల తమపై అపనమ్మకం పెట్టుకోవద్దు రైతులకు విజ్ఞప్తి చేశారు. రెండు లక్షల రుణమాఫీ అర్హులైన ప్రతి రైతుకు చేస్తామని తెలిపారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉంటాము.. చేయకపోతే నిలదీయండని మంత్రి చెప్పారు.
Read Also: School Bus: హైదరాబాద్లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. అదుపుతప్పి చెట్ల పొదల్లోకి
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..