Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఉత్తరప్రదేశ్ లోని కాసగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమాంపూర్ కోతవాలి పరిధిలోని ఎటా రోడ్డుపై ఉన్న ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తండ్రి, తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
IND vs SA: నేడు సూపర్-8లో భారత్ తొలి పోరు.. టీ20ల్లో భారత్-దక్షిణాఫ్రికా హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఇవే
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
మృతుడు సత్యేంద్ర అలియాస్ ఫౌజీగా పోలీసులు గుర్తించారు. అతను తన భార్య, ఇద్దరు కుమార్తెలు (12, 10 సంవత్సరాలు), ఒక కుమారుడు (8 సంవత్సరాలు)తో కలిసి నివసిస్తున్నాడు. శనివారం సాయంత్రం సత్యేంద్ర మృతదేహం గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా.. భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు మంచంపై పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మూడు రోజులుగా ఇల్లు మూసివేసి ఉండటం, ఎలాంటి శబ్దం లేకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. శనివారం సాయంత్రం కూడా ఇంటి నుంచి ఎలాంటి అలజడి లేకపోవడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు తట్టినా స్పందించకపోవడంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం వారిని షాక్కు గురి చేసింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ తో పాటు ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాన్ని కూడా పిలిపించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Pakistan Airstrikes: ఆఫ్ఘన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడి..19 మంది మృతి
స్థానికుల ప్రకారం, సత్యేంద్ర ముందుగా భార్య, పిల్లలను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇది హత్యా–ఆత్మహత్యా లేదా సమూహ ఆత్మహత్యా అనే విషయంపై స్పష్టత పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!