Tummala Nageswara Rao: అందుకే వాళ్లకి రుణమాఫీ కాలేదు.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి.. మంత్రి సూచన
- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న
- కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు
- రైతులను దగా చేసి.. అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం
- రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం
- హామీని నెరవేర్చాం
- రుణమాఫీ పై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు. “రైతులను దగా చేసి, అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం.. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మొదటి పంటలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో.. హామీని అమలు చేశాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లాంటి సాంకేతిక ఇబ్బందులు వల్ల కొన్ని ఆగాయి. ఆగస్టు 14 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు లిస్టు తయారు చేసి ఇచ్చారు. దానికి అనుగుణంగా చేశాం. గత ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కొద్ది మంది రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41.78 892లక్షల మంది రుణాలు తీసుకున్న లిస్టు వచ్చింది. 40 బ్యాంకుల నుంచి వచ్చిన లిస్టు ప్రకారం నగదు జమ చేశాం.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Champai soren: చంపై సోరెన్ యూటర్న్.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
రూ. 31 లక్షల కోట్లు అవసరమని మంత్రి అన్నారు. ఆగస్టు15 న రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సర్వర్ ఇబ్బందులతో మరి కొన్ని బ్యాంకులు కొంత మంది లిస్ట్ ఇవ్వలేదన్నారు. నిసిగ్గుగా నిర్లజ్జగా ప్రతి పక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. “గత ప్రభుత్వం ఎన్నికలకి కొద్ది రోజుల ముందు బూటకపు మాటలతో ఓఆర్ఆర్ ను అమ్మి రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని కొద్ది మందికి మాఫీ చేశారు. దేశ చరిత్రలో మొదటి సంవత్సరం, మొదటి పంటలోనే ఋణాలు మాఫీ చేసిన ఘనట కాంగ్రెస్ ది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే… ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి ఋణ విముక్తి చేయడానికి మేము ఓ మంచి నిర్ణయం తీసుకున్నాం. కాగ్ నివేదిక కూడా గత ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇలాంటి చిల్లారా రాజకీయాలు మానుకోవాలి. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం… పూర్తి చేశాం. రుణమాఫీ కాని వాళ్ళు.. బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఆ తర్వాత వాళ్లవి కూడా రుణమాఫీ చేస్తాం.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!