Tummala Nageswara Rao: అందుకే వాళ్లకి రుణమాఫీ కాలేదు.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి.. మంత్రి సూచన
- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న
- కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు
- రైతులను దగా చేసి.. అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం
- రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం
- హామీని నెరవేర్చాం
- రుణమాఫీ పై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు. “రైతులను దగా చేసి, అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం.. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మొదటి పంటలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో.. హామీని అమలు చేశాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లాంటి సాంకేతిక ఇబ్బందులు వల్ల కొన్ని ఆగాయి. ఆగస్టు 14 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు లిస్టు తయారు చేసి ఇచ్చారు. దానికి అనుగుణంగా చేశాం. గత ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కొద్ది మంది రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41.78 892లక్షల మంది రుణాలు తీసుకున్న లిస్టు వచ్చింది. 40 బ్యాంకుల నుంచి వచ్చిన లిస్టు ప్రకారం నగదు జమ చేశాం.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Champai soren: చంపై సోరెన్ యూటర్న్.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు!
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
రూ. 31 లక్షల కోట్లు అవసరమని మంత్రి అన్నారు. ఆగస్టు15 న రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సర్వర్ ఇబ్బందులతో మరి కొన్ని బ్యాంకులు కొంత మంది లిస్ట్ ఇవ్వలేదన్నారు. నిసిగ్గుగా నిర్లజ్జగా ప్రతి పక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. “గత ప్రభుత్వం ఎన్నికలకి కొద్ది రోజుల ముందు బూటకపు మాటలతో ఓఆర్ఆర్ ను అమ్మి రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని కొద్ది మందికి మాఫీ చేశారు. దేశ చరిత్రలో మొదటి సంవత్సరం, మొదటి పంటలోనే ఋణాలు మాఫీ చేసిన ఘనట కాంగ్రెస్ ది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే… ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి ఋణ విముక్తి చేయడానికి మేము ఓ మంచి నిర్ణయం తీసుకున్నాం. కాగ్ నివేదిక కూడా గత ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇలాంటి చిల్లారా రాజకీయాలు మానుకోవాలి. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం… పూర్తి చేశాం. రుణమాఫీ కాని వాళ్ళు.. బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఆ తర్వాత వాళ్లవి కూడా రుణమాఫీ చేస్తాం.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..