Tummala Nageswara Rao: అందుకే వాళ్లకి రుణమాఫీ కాలేదు.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి.. మంత్రి సూచన
- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న
- కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు
- రైతులను దగా చేసి.. అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం
- రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం
- హామీని నెరవేర్చాం
- రుణమాఫీ పై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు. “రైతులను దగా చేసి, అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం.. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మొదటి పంటలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో.. హామీని అమలు చేశాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లాంటి సాంకేతిక ఇబ్బందులు వల్ల కొన్ని ఆగాయి. ఆగస్టు 14 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు లిస్టు తయారు చేసి ఇచ్చారు. దానికి అనుగుణంగా చేశాం. గత ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కొద్ది మంది రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41.78 892లక్షల మంది రుణాలు తీసుకున్న లిస్టు వచ్చింది. 40 బ్యాంకుల నుంచి వచ్చిన లిస్టు ప్రకారం నగదు జమ చేశాం.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Champai soren: చంపై సోరెన్ యూటర్న్.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు!
Also Read
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
- ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
రూ. 31 లక్షల కోట్లు అవసరమని మంత్రి అన్నారు. ఆగస్టు15 న రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సర్వర్ ఇబ్బందులతో మరి కొన్ని బ్యాంకులు కొంత మంది లిస్ట్ ఇవ్వలేదన్నారు. నిసిగ్గుగా నిర్లజ్జగా ప్రతి పక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. “గత ప్రభుత్వం ఎన్నికలకి కొద్ది రోజుల ముందు బూటకపు మాటలతో ఓఆర్ఆర్ ను అమ్మి రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని కొద్ది మందికి మాఫీ చేశారు. దేశ చరిత్రలో మొదటి సంవత్సరం, మొదటి పంటలోనే ఋణాలు మాఫీ చేసిన ఘనట కాంగ్రెస్ ది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే… ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి ఋణ విముక్తి చేయడానికి మేము ఓ మంచి నిర్ణయం తీసుకున్నాం. కాగ్ నివేదిక కూడా గత ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇలాంటి చిల్లారా రాజకీయాలు మానుకోవాలి. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం… పూర్తి చేశాం. రుణమాఫీ కాని వాళ్ళు.. బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఆ తర్వాత వాళ్లవి కూడా రుణమాఫీ చేస్తాం.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!