TGS RTC: ఆర్టీసీ అదరహో.. రక్షాబంధన్ వేళ లక్షల మంది సోదరీమణులకు అండగా సేవలు!
- రాఖీ ఆపరేషన్స్.. మెరుగైన పనితీరుపై ఆర్టీసీ ఎండీ సమీక్ష
- మూడు రోజుల్లో 1.74 కోట్ల మంది ప్రయాణం
- రక్షాబంధన్ రోజు 63 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ
- క్షేత్ర స్థాయి అధికారులను ప్రశంసించిన సజ్జనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాఖీ ఆపరేషన్స్, మెరుగైన పనితీరుపై తమ క్షేత్రస్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రత్యేకంగా సమావేశమైంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్వల్గా బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. రాఖీ పండుగ ఆపరేషన్స్లో సిబ్బంది పనితీరు, అనుభవాలతో పాటు భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
READ MORE: Cyber crime: అలర్ట్.. పాడైన ఫోన్లు అమ్ముతున్నారా.. చిక్కుల్లో పడ్డట్లే!
Also Read
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
ఈ సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. భారీ వర్షాల్లోనూ నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని ప్రశంసించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో రికార్డుస్థాయిలో 1.74 కోట్ల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు సంస్థ చేరవేసిందని తెలిపారు. వరుసగా మూడు రోజులు సంస్థలో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదైందని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాఖీ ఒక్క రోజే 63 లక్షల మంది తమ బస్సుల్లో రాకపోకలు సాగించారని గుర్తు చేశారు. మూడు రోజుల్లో 1.07 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు తిరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది రాఖీ పౌర్ణమి నాడు 21 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదు చేయగా.. ఈ సారి 97 డిపోలు ఆ మైలురాయిని దాటాయని తెలిపారు. ఈ రాఖీ పండుగ టీజీఎస్ఆర్టీసీ రికార్డులన్నింటినీ తిరగరాసిందని తెలిపారు.
READ MORE:T-Safe: అమ్మాయిలూ.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా?
అత్యధిక ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదు చేసిన మహబుబ్నగర్, నల్లగొండ, మెదక్, వరంగల్, కరీంనగర్ రీజియన్ల ఆర్ఎంలను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, దుబ్బాక, కల్వకుర్తి, ముషీరాబాద్, దేవరకొండ, తొర్రూర్, నార్కెట్పల్లి, షాద్నగర్ డిపోలు అత్యధిక ఓఆర్ను నమోదు చేశాయని, ఆయా డీఎంలకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి నాడు విధుల్లో నిర్వర్తిస్తున్న సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్న సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ను ఈ సందర్భంగా అధికారులు అభినందించారు. భోజనం అందించడం వల్ల ఎలాంటి ఆలస్యం లేకుండా ఆపరేషన్స్ సజావుగా జరిగాయని, కొందరు డ్రైవర్లు బస్సు స్టీరింగ్ పై కూర్చుని భోజనం చేసి.. వృత్తి పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారని యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు, సిబ్బంది పనితనాన్ని యాజమాన్యం గుర్తిస్తుందని, రాఖీ పౌర్ణమి ఆపరేషన్స్లో మెరుగైన పనితీరును కనబరిచిన వారికి త్వరలోనే రివార్డులను అందజేస్తుందని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీని ఆదరిస్తూ.. వెన్నుదన్నుగా నిలుస్తోన్న ప్రయాణికులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
READ MORE:Maharaja: బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి నెట్ఫ్లిక్స్లో మహారాజా మాస్ రికార్డ్..!
ఈ సమావేశంలో సీవోవో డాక్టర్ రవిందర్, జేడీ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ఫ, వివిధ విభాగాల హెచ్వోడీలు శ్రీదేవి, శ్రీధర్, వెంకన్న, సుధాపరిమళ, విజయభాస్కర్, డిప్యూటీ సీటీఎం జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. వర్చ్వల్గా హైదరాబాద్ అండ్ కరీంనగర్ జోన్ ఈడీ వినోద్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లుతో పాటు ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..