Minister Srinivas Goud: నేను ఎలాంటి వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు తనపై వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. బీఆర్ఎస్ నేతలపై విపక్షాలకు ఎందుకు అంత అక్కసు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మాయమాటలతో ప్రజల ఓట్లు సంపాదించుకోలేరని.. అధిక మెజార్టీతో గెలిచిన తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: President Of India: టైమిచ్చిన రాష్ట్రపతి.. రేపు ఉదయం కలవనున్న ఇండియా ఎంపీలు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
మమ్మల్ని కులం చూసి కాదని, గుణం చూసి గెలిపించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. అన్ని వర్గాలను కంటికి రెప్పలా కాపాడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఏనాడు అహంకారపూరితంగా వ్యవహరించలేదని.. గతంలోనూ తనపై అనేక ఆరోపణలు చేశారని మంత్రి ఆగ్రహ వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు ఎదిగితే కొందరు సహించలేకపోతున్నారు.. కేసీఆర్ ఉన్నంత వరకు మాకేం కాదని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నిన్నగాక మొన్న కర్ణాటకలో అధికారంలోకి కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పి.. ఇప్పుడు పురుషులకు మాత్రమేనని అంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
Read Also: Andhrapradesh: సీఎం వైఎస్ జగన్ను కలిసిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం
అలాగే.. నామినేషన్ అఫిడవిట్ లో ట్యాంపరింగ్ చేశారంటూ మరి కొందరు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి నాలుగు నామినేషన్ లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది.. నా అఫిడవిట్ లో ఎలాంటి ట్యాంపరింగ్ లేదని గతంలోనే ఈసీ నివేదిక ఇచ్చింది అని ఆయన తెలిపారు. ఎదైనా ప్రైవేటు ఫిర్యాదు వస్తే.. కోర్టు విచారణ చేయమని చెబుతుంది.. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.. కాబట్టి నేను దానిపై ఎక్కువ మాట్లాడను.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు నా మీద కుట్ర చేస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!