Minister Srinivas Goud: నేను ఎలాంటి వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు తనపై వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. బీఆర్ఎస్ నేతలపై విపక్షాలకు ఎందుకు అంత అక్కసు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మాయమాటలతో ప్రజల ఓట్లు సంపాదించుకోలేరని.. అధిక మెజార్టీతో గెలిచిన తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: President Of India: టైమిచ్చిన రాష్ట్రపతి.. రేపు ఉదయం కలవనున్న ఇండియా ఎంపీలు
Also Read
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
మమ్మల్ని కులం చూసి కాదని, గుణం చూసి గెలిపించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. అన్ని వర్గాలను కంటికి రెప్పలా కాపాడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఏనాడు అహంకారపూరితంగా వ్యవహరించలేదని.. గతంలోనూ తనపై అనేక ఆరోపణలు చేశారని మంత్రి ఆగ్రహ వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు ఎదిగితే కొందరు సహించలేకపోతున్నారు.. కేసీఆర్ ఉన్నంత వరకు మాకేం కాదని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నిన్నగాక మొన్న కర్ణాటకలో అధికారంలోకి కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పి.. ఇప్పుడు పురుషులకు మాత్రమేనని అంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
Read Also: Andhrapradesh: సీఎం వైఎస్ జగన్ను కలిసిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం
అలాగే.. నామినేషన్ అఫిడవిట్ లో ట్యాంపరింగ్ చేశారంటూ మరి కొందరు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి నాలుగు నామినేషన్ లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది.. నా అఫిడవిట్ లో ఎలాంటి ట్యాంపరింగ్ లేదని గతంలోనే ఈసీ నివేదిక ఇచ్చింది అని ఆయన తెలిపారు. ఎదైనా ప్రైవేటు ఫిర్యాదు వస్తే.. కోర్టు విచారణ చేయమని చెబుతుంది.. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.. కాబట్టి నేను దానిపై ఎక్కువ మాట్లాడను.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు నా మీద కుట్ర చేస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!