Sridhar Babu: రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి..
- కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం.. చేసి చూపెడతాం- మంత్రి శ్రీధర్ బాబు
- రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి- శ్రీధర్ బాబు
- 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత మాది- మంత్రి
- 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయి- శ్రీధర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం… చేసి చూపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగా.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తమదని అన్నారు. 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రుణమాఫీపై కేటీఆర్, బండి సంజయ్ అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక లక్ష కూడా మాఫీ చేయలేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు.
Read Also: Stock market: మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్! భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
Also Read
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
- Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.170 కోట్లతో నిర్మించే ఫామాయిల్ కంపెనీలో 250 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యాక్టరీలో ఎంప్లాయిమెంట్ కల్పిస్తూ నేరుగా 500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టే యాజమాన్యానికి రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని తెలిపారు. 100 కోట్ల రూపాయలతో ప్రతిరోజు 350 టన్నుల ఉత్పత్తికి 120 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రైస్ బ్రాండ్ ఆయిల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యానికి ప్రాంత రైతుల పక్షాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటుకు సర్వే కొనసాగుతుందని ఆయన తెలియజేశారు.
Read Also: Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..
తాజావార్తలు
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!