Sridhar Babu: రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి..
- కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం.. చేసి చూపెడతాం- మంత్రి శ్రీధర్ బాబు
- రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి- శ్రీధర్ బాబు
- 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత మాది- మంత్రి
- 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయి- శ్రీధర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం… చేసి చూపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగా.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తమదని అన్నారు. 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రుణమాఫీపై కేటీఆర్, బండి సంజయ్ అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక లక్ష కూడా మాఫీ చేయలేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు.
Read Also: Stock market: మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్! భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
Also Read
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.170 కోట్లతో నిర్మించే ఫామాయిల్ కంపెనీలో 250 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యాక్టరీలో ఎంప్లాయిమెంట్ కల్పిస్తూ నేరుగా 500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టే యాజమాన్యానికి రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని తెలిపారు. 100 కోట్ల రూపాయలతో ప్రతిరోజు 350 టన్నుల ఉత్పత్తికి 120 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రైస్ బ్రాండ్ ఆయిల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యానికి ప్రాంత రైతుల పక్షాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటుకు సర్వే కొనసాగుతుందని ఆయన తెలియజేశారు.
Read Also: Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..
తాజావార్తలు
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!