Seediri Appalaraju: చంద్రబాబు బెయిల్ పొడిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju: చంద్రబాబు లాయర్ హైకోర్టులో మెమో ఫైల్ చేశారని.. గుండె పరిమాణం పెరిగిందని చెబుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. వాదనలలో తాను నిప్పు అంటూ స్క్వాష్ పిటిషన్ వేశారన్నారు. మానవతా దృక్పదంతోనే, ఆరోగ్య కారణాలతోనే బెయిల్ వచ్చిందన్నారు. నిజం గెలవాలని తిరిగినా ఆవిడ ఎక్కడుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు. నిజం గెలిస్తే.. చంద్రబాబుకి జీవిత కాలం జైలు శిక్ష పడుతుందన్నారు. బెయిల్ వచ్చిన వెంటనే ఓదార్పు యాత్రను ఆపేశారని… ఇదేం అన్యాయమన్నారు. చంద్ర బాబు జబ్బుల రిపోర్ట్లు డాక్టర్గా పరిశీలించానన్న మంత్రి.. రిపోర్టులలో వ్యాధులు సీరియస్గా ఉన్నాయని రాశారన్నారు. హై రిస్క్ కేసును ఏఐజీ హాస్పిటల్ నుంచి ఎలా డిశ్చార్జ్ చేశారని, కంటి ఆపరేషన్కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు రిపోర్టులను ఏ డాక్టరుకు చూపించినా.. కంటి ఆపరేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తారన్నారు.
Also Read: Indrakeeladri: ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు
Also Read
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
కాల్షియం స్కోర్ 900 నుండి 1600 లకు పెరిగితే ఎందుకు యాంజియోగ్రామ్ చేయలేదన్నారు. బైపాస్ సర్జరీ వెంటనే చేయాలి కదా అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. బెయిల్ పొడిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారన్నారు. తన లాయర్ల ద్వారా హాస్పిటల్లో స్టోరీలు రాయించి కోర్టుకు ఇస్తున్నారన్నారు. రిపోర్ట్లో ఎక్కడా ఆయన జబ్బుల కోసం వాడే మెడిసిన్ వాడినట్లు రాయలేదన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టించి బెయిల్ని పొడిగించడానికే ఈ రిపోర్ట్ అంటూ ఆయన ఆరోపించారు. టీడీపీ ఆఫీస్లోనే హాస్పిటల్ రిపోర్ట్ తయారు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. ఓ పక్క నిప్పుని అంటూ వీధుల్లో తిరగడానికి బెయిల్ అడగొద్దన్నారు.
Also Read: Andhrapradesh: ఏపీలో జరుగుతోన్న బీసీ కులగణనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
రిపోర్టుల ప్రకారం చంద్రబాబుకు వెంటనే చికిత్సను అందించాలన్నారు. హాస్పిటల్ రిపోర్టుని గౌరవ కోర్టు వారు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జైలుకు వెళ్లిన నాటి నుంచి ముసలోడిని జైల్లో పెడతారా అంటూ టీడీపీ నేతలు మాట్లాడారన్నారు. చంద్రబాబుకి లేని రోగం లేదని ఇప్పుడు మరలా పార్టీ, ఇంటి వారే ప్రకటిస్తున్నారన్నారు. చంద్రబాబు పరువు ఇంటి వారే తీస్తున్నారని మంత్రి అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు పనికిరాడని చెప్పే ప్రయత్నం కుటుంబసభ్యులే చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సామాన్యులు చంద్రబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని కోరుతున్నారని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!