Seediri Appalaraju: విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష.. ఇక అక్కడి నుంచే పాలన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju: డిసెంబర్ మొదటి వారం నుంచే సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారని.. విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అంటూ పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం విశాఖను రాజధానిగా చేయాలనుకున్నారని మంత్రి చెప్పారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర వెనుకబాటును గుర్తించి.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే గానీ అభివృద్ధి చెందదని భావించారన్నారు.
కోర్టులలో ఓ పక్క పోరాటం చేస్తూనే.. మరో వైపు పరిపాలన, సమీక్షలు చేయడానికి కార్యాలయాలు చూశారని ఆయన చెప్పారు. టీడీపీ, దత్తపుత్రుడు విషం చిమ్ముతున్నారని.. మిలీనియం టవర్స్, రుషికొండ గెస్ట్ హౌస్ని కబ్జా చేస్తున్నామంటున్నారని ఆయన మండిపడ్డారు. అదేమన్న మీ బాబు ఆస్తి నా… అవి ప్రభుత్వ భవనాలు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భవనాలు వ్యక్తులకు సొంతం అవ్వదని.. చంద్రబాబు, లోకేష్, పవన్ అడ్రస్లు హైదరాబాద్ అని.. హైదరాబాద్లో ఉండి.. ఆంధ్రా ప్రజలకు నిర్దేశిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఇంత బానిసత్వం అవసరమా అంటూ వ్యాఖ్యానించారు. బోగాపురం, మూలపేట పోర్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. విశాఖలో ఐటి ఇండస్ట్రీ తెచ్చింది వైఎస్సార్ అని.. మీరు చేసిందేంటి అని టీడీపీని ప్రశ్నించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
Also Read: Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం
పెద్ద పెద్ద క్యాంపస్లు ఇన్ఫోసిస్ లాంటివి వస్తున్నాయని.. సరైన కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమ బాటపడతారని మంత్రి చెప్పుకొచ్చారు. వేరే రాష్ట్రంలో ఆ రాష్ట్రం గురించి మాట్లాడుకో పవన్ అని మండిపడ్డ మంత్రి.. పక్క రాష్ట్రంలో ఏపీ ప్రతిష్ఠ దిగజార్చేలా మాట్లాడొద్దని హితవు పలికారు. పవన్ కాన్సెప్టేంటి… తెలంగాణలో బీజేపీ. ఇక్కడ టీడీపీతో అలియన్స్ ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఇది అంటూ విమర్శలు గుప్పించారు. పవన్ నిజజీవితంలో, రాజకీయాల్లో ఓకేలా ఉన్నాడని.. విలువలు లేకుండా ఉన్నాడని మండిపడ్డారు. నారా లోకేష్ పనికిమాలినవాడని పేర్కొన్న మంత్రి.. అసలు అందులో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా అంటూ ప్రశ్నించారు. సింగిల్ విండో ద్వారా కంపెనీలకు అనుమతులిస్తున్నామని మంత్రి తెలిపారు. చంద్రబాబు అమరావతి రాజధాని ప్రకటించి.. హైదరాబాద్ హోటల్లో ఉండ లేదా అంటూ ప్రశ్నించిన మంత్రి.. సీఎం ఇక్కడే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!