Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana Assembly Elections 2023 Congress Leader Priyanka Gandhi Fires On Brs Government At Palakurthi

Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం

Published Date :November 24, 2023 , 4:37 pm
By Mahesh Jakki
Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్  రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Priyanka Gandhi: జై బోలో తెలంగాణ అని నినదించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామికి జై కొట్టారు ప్రియాంకా గాంధీ. ఝాన్సీ రెడ్డి కుటుంబం చాలా సేవాభావం గల కుటుంమని ఆమె వెల్లడించారు. రైతుల భూములు లాక్కునే కుటుంబం బీఆర్‌ఎస్ కుటుంబం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని.. ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే మీ ఓటు విలువైనది అంటూ ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. త్యాగం చేసిన వాళ్లు ఒకవైపు, దోపిడి చేసిన వాళ్లు మరోవైపు.. అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనేది ఆలోచించి ఓటు వేయాలన్నారు. మీరు కష్టపడి ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయితే, పేపర్‌ లీకులు అవుతున్నాయని.. పేపర్‌ లీకులతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్యల కారణాలను కూడా ఈ ప్రభుత్వం వక్రీకరించిందని మండిపడ్డారు.

Also Read: DK Shivakumar: కేసీఆర్, కేటీఆర్‌లను ఓడించి పర్మినెంట్‌గా ఫాంహౌజ్‌కి పంపండి

Also Read

  • Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
  • Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
  • Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
  • Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల

పేపర్ లీకేజీల కుంభకోణాన్ని అరికట్టడానికి జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుందన్నారు. మా అక్క చెల్లెళ్లకి క్షమాపణ చెప్తున్నా.. ఇంత సేపు నాకోసం అన్ని పనులు వదిలేసి వచ్చినందుకు అంటూ ప్రియాంక చమత్కరించారు. గ్రామ గ్రామాన వైన్స్, బెల్ట్ షాపులు అక్కా చెల్లెళ్ళ జీవితాలను పాడుచేస్తున్నాయన్నారు. తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు బాగా జరుగుతున్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు ప్రియాంకా గాంధీ. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ సర్కారు అని ఆమె విమర్శించారు. రైతు సంపాదించిన భూములను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని ఆమె ఆరోపించారు. రైతులకి కనీస మద్దతు ధర కచ్చితంగా ఇస్తామని.. కేసీఆర్ సర్కార్ వచ్చి 10 సంవత్సరాలు గడిచినా అన్యాయమే జరుగుతోందని ప్రియాంక విమర్శించారు.

Also Read: YS Sharmila: పదేళ్లు తెలంగాణలో జరిగింది దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన

మందులకి చివరి తేదీ ఎలా ఉంటాదో.. అలా బీఆర్‌ఎస్‌కు ఎక్సపైరీ తేదీ ఇప్పుడు వచ్చిందన్నారు. ప్రభుత్వాలు మీ ఆలోచనలను మరిచి వాళ్ల కుటుంబ పాలన కోసం పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం ఈ ప్రభుత్వం ఫామ్ హౌస్‌లకే పరిమితం అంటూ విమర్శించారు. దళితులకు ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో చాలా లక్షల కోట్ల కుంభకోణం చేసి దోచుకున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ పార్టీలు ఒక్కటేనని.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దొరల తెలంగాణ చేసిందని.. మేము వచ్చాక దొరల తెలంగాణని ప్రజల తెలంగాణ చేస్తామన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Palakurthi
  • Priyanka Gandhi
  • Telangana Assembly Elections
  • telangana elections 2023

తాజావార్తలు

  • Air India to Cut Flights: ఎయిర్‌ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..

  • Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్‌లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?

  • MS Dhoni: “ధోనీ ఎక్కడ?”.. కనీసం డగౌట్‌లోనూ కనిపించని మిస్టర్ కూల్.. అసలు గుట్టు విప్పిన కోచ్

  • Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు

  • NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions