Sabitha Indra Reddy : అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగిస్తాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరుసగా పరీక్షపత్రాల లీకుల ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనను మరవకముందే.. పదో తరగతి పరీక్షా పత్రాలు లీకవుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. నేడు బీఆర్కే భవన్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పేపర్ లీకేజీల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న తాండూర్ లో తెలుగు పేపర్, ఈ రోజు వరంగల్ కమలాపుర్ మండలంలో హిందీ పేపర్ లీకైన ఘటనపై ఆరా తీశారు. రెండు చోట్లా పరీక్ష ప్రారంభం అయ్యాక బయటకు రావడంపై ఇప్పటికే పోలీస్ విభాగం, విద్యాశాఖ విచారణ చేపట్టాయి. అయితే.. వరంగల్ ఘటనపై ప్రాధమిక నివేదికను తెప్పించుకున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అయితే.. ఇది లీకేజీ కాదని ఇప్పటికే పేర్కొన్నారు వరంగల్ సీపీ రంగనాథ్.
Also Read : Cruel Father: ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య.. అడ్డొచ్చిన భార్య, కోడలిపై..
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
అయితే.. రేపటి నుంచి ఇంకా నాలుగు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రశ్నే లేదన్నారు. ఎక్కడ పేపర్ లీక్ కాలేదన్నారు. అదే సమయంలో.. వీడియో కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ అధికారులపై మంత్రి సబితా సీరియస్ అయ్యారు. నేను సీరియస్ గా ఉంటే ఉద్యోగాలు పోతాయని మంత్రి హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం బీఆర్కే భవన్ నుంచి వెళుతున్నా సమయంలో.. పదవ తరగతి పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థినిలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముచ్చటించారు. మహేశ్వరం నియోజకవర్గము మీర్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరై బయటకు వస్తున్న విద్యార్థినిలను చూసి కాన్వాయ్ ఆపి కారు దిగి వారితో మాట్లాడారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరీక్షలు ఎలా రాసారు అని ప్రశ్నించగా బాగా రాసామని విద్యార్థినీలు బదులు ఇచ్చారు. బాగా కష్టపడి చదివి రాయాలని మంత్రి ప్రోత్సహించారు.
Also Read : Ajit Pawar: ప్రజలు డిగ్రీ ఆధారంగా మోడీకి ఓటేశారా?
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!