Ajit Pawar: ప్రజలు డిగ్రీ ఆధారంగా మోడీకి ఓటేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీ డిగ్రీ పట్టా అంశంపై ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఇటీవల గుజరాత్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీ అన్నీ మోడీ డిగ్రీ పట్టా అంశంపై గురి పెట్టాయి. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: MS Dhoni: ఆడింది 3 బాల్సే.. కానీ రికార్డు సాధించాడు.. ధోనీ అంటే అట్లుంటది..
మంత్రుల పట్టాలపై ప్రశ్నించడం సరికాదని, ఒక నాయకుడు తమ హయాంలో ఏం సాధించారనే దానిపై ప్రజలు దృష్టి సారించాలని ఎన్సిపి నేత అజిత్ పవార్ అన్నారు. ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల గురించి అజిత్ పవార్ మాట్లాడుతూ.. 2014లో ప్రధాని మోదీకి డిగ్రీ ఆధారంగానే ప్రజలు ఓటేశారా.. ఆయన సృష్టించిన చరిష్మాయే ఎన్నికల్లో గెలవడానికి దోహదపడింది అని చెప్పారు.
Also Read
- CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Iran-Hormuz: హార్ముజ్పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?
ఇప్పుడు తొమ్మిదేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని డిగ్రీ గురించి అడగడం సరికాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై మనం ఆయనను ప్రశ్నించాలి. ప్రధాని డిగ్రీ ముఖ్యమైన అంశం కాదు అని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఆయన డిగ్రీపై క్లారిటీ వస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుందా.. అతని డిగ్రీ స్థితిగతులను తెలుసుకుని ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు.
Also Read:MS Dhoni: ఆడింది 3 బాల్సే.. కానీ రికార్డు సాధించాడు.. ధోనీ అంటే అట్లుంటది..
గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తన కాలేజీ డిగ్రీలను ప్రజల డొమైన్లో పెట్టాలని అన్నారు. తమ ప్రధాని ఎంత చదువుకున్నారో తెలుసుకునే హక్కు కూడా దేశానికి లేదా? అని ప్రశ్నించారు. కోర్టులో తన డిగ్రీని ప్రదర్శించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మోడీ డిగ్రీని చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధిస్తారా? అంటూ మండిపడ్డారు. నిరక్షరాస్యులైన లేదా తక్కువ విద్యావంతులైన ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం’ అని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
-
Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!