Ramprasad Reddy: త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు!
- త్వరలోనే జగన్ ,పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు
- రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారు
- రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయి
- చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని విమర్శించారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.
చిత్తూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ‘త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారు అటవీ భూఅక్రమ జరిగింది కాబట్టి అందరి మీద కేసులు నమోదు చేశాం. తప్పు చేసిన వారికి వయసుతో సంబంధం ఏం ఉంది?. 60 ఏళ్లు దాటాయి కాబట్టి.. తప్పు చేసినా, అవినీతి చేసినా వదిలేయాలా?. తప్పులు చేశారు కాబట్టే 10 గంటలు, 15 గంటలు కాదు.. ఎన్ని గంటలైనా విచారిస్తారు’ అని అన్నారు.
Also Read
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు!
’75 ఏళ్ల చంద్రబాబు నాయుడుపై ఒక దొంగ కేసు పెట్టి 50 రోజులు జైల్లో పెట్టింది వైసీపీనే కదా?. మేము ఏమీ రోడ్డు మీద పోయో వారిని ఎవరినీ విచారించలేదు. ఆర్కే రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయి, రాజకీయాల్లో అస్సలు పనికిరావు. సినిమా డైలాగులు చెప్పి చెప్పి రోజా నలబై వేల ఓట్లతో ఓడిపోయింది. మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే’ అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!