Ramprasad Reddy: త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు!
- త్వరలోనే జగన్ ,పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు
- రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారు
- రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయి
- చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని విమర్శించారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.
చిత్తూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ‘త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారు అటవీ భూఅక్రమ జరిగింది కాబట్టి అందరి మీద కేసులు నమోదు చేశాం. తప్పు చేసిన వారికి వయసుతో సంబంధం ఏం ఉంది?. 60 ఏళ్లు దాటాయి కాబట్టి.. తప్పు చేసినా, అవినీతి చేసినా వదిలేయాలా?. తప్పులు చేశారు కాబట్టే 10 గంటలు, 15 గంటలు కాదు.. ఎన్ని గంటలైనా విచారిస్తారు’ అని అన్నారు.
Also Read
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు!
’75 ఏళ్ల చంద్రబాబు నాయుడుపై ఒక దొంగ కేసు పెట్టి 50 రోజులు జైల్లో పెట్టింది వైసీపీనే కదా?. మేము ఏమీ రోడ్డు మీద పోయో వారిని ఎవరినీ విచారించలేదు. ఆర్కే రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయి, రాజకీయాల్లో అస్సలు పనికిరావు. సినిమా డైలాగులు చెప్పి చెప్పి రోజా నలబై వేల ఓట్లతో ఓడిపోయింది. మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే’ అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!