Peddireddy Ramachandra Reddy: ఆయనకే గ్యారెంటీ లేదు.. ఆయన ఇచ్చే గ్యారెంటీలను ఎవరు నమ్ముతారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ఇక, ఆయన ఇచ్చే గ్యారెంటీని ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. వచ్చే నెల 3న అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమ పోస్టర్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సమావేశంలో సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సమాయత్తం అవ్వాలని పిలుపునిచ్చారు. గురుమూర్తి ఉప ఎన్నికలో విజయం సాధించారు.. రానున్న ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారు.. సత్యవేడు నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో గురు మూర్తి విజయానికి కృషి చేయాలని సూచించారు.
Read Also: RGV: చిరంజీవికి పద్మ పురస్కారం.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
ఇక, రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకం అయ్యాయి.. చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.. ఆమెపై గౌరవం ఉంది.. కానీ, ఆమె చంద్రబాబు చేసే విమర్శలే చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల జాడ లేకుండా పోయిందన్నారు. సీఎం వైఎస్ జగన్ అనంతరపురంలో ఫిబ్రవరి 3వ తేదీన సిద్ధం కార్యక్రమంలో పాల్గొంటారు.. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 29న తిరుపతిలో నిర్వహిస్తాం అన్నారు. మరోవైపు.. పీలేరు సభలో చంద్రబాబు అన్నీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తి మన జిల్లాలో ఎలా పుట్టాడో అంటూ హాట్ కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పేవి అన్నీ అబద్ధాలే, ప్రజలు ఎవరు నమ్మవద్దు అని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలో లేనప్పుడు మరోమాట చంద్రబాబు నైజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!