Niranjan Reddy : అన్నదాతలను ఆదుకుంటున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో తెలంగాణ పచ్చగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని దుగ్గొండి మండలం చలపర్తిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిధులతో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి నిరంజన్రెడ్డి ఓపెనింగ్ చేశారు. గతంలో 36 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉండేవని.. ఈ తొమ్మిదేళ్లలో 74లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెల్లో రైతు భూముల విలువ గణనీయంగా పెరిగాయన్నారు.
Also Read : MI vs GT: శతక్కొట్టిన సూర్య.. జీటీ ముందు భారీ లక్ష్యం
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
రైతుబీమా, రైతుబంధు పథకాల గొప్పదనం అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తుందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర నిధులతో రూ.10వేల నష్ట పరిహారం చెల్లిస్తున్నామన్నారు. రూ.65 వేల కోట్లు రైతుబంధుకు రూ.5 వేల కోట్లు రైతుబీమాకు అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఒక వ్యవసాయ రంగం పైనే రూ.4.50 లక్షలు కోట్లు, సాగునీటి రంగంపై రూ.1.59 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. మొక్కజొన్నల కొనుగోలు కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిరంజన్రెడ్డి వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రం ఈ విధంగా ఖర్చు చేయలేదని వెల్లడించారు. వ్యవసాయ యాంత్రికీకరణ కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు.
Also Read : ప్రపంచంలోనే ఎక్కువ నేర చరిత్ర కలిగిన దేశాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మారుమూల గ్రామానికి సైతం సాగు, తాగునీరు అందుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులందరిని ఆదుకునేందకు నర్సంపేట నియోజకవర్గానికి రూ.40కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పంట నష్టపోయిన రైతులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పండిన పంటకు సరిపడా గోదాములు నిర్మించామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైతులకు అందుతున్న పథకాలు నేడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తడిసిన వడ్లను కూడా కొనాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!