Nadendla Manohar: ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవు.. దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీ!
- రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవు
- చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా
- వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని, 9 వేలకు పైగా వ్యాన్లు ఏర్పాటు చేసి రూ.18 వేల కోట్లు దుర్వినియోగం చేశారని మంత్రి నాదెండ్ల ఫైర్ అయ్యారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు.
Also Read: AP ICET 2025: ఐసెట్ ఫలితాలు విడుదల.. విశాఖ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్!
Also Read
‘గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారు. 9 వేలకు పైగా వ్యాన్లు ఏర్పాటు చేసి రూ.18 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. గత ప్రభుత్వ తీరుతో వినియోగదారులకు సమస్యలు వచ్చాయి. బియ్యం ఏ విధంగా రవాణా జరుగుతుందో తనిఖీ చేశాం. రేషన్ కోసం వ్యాన్లు తెచ్చిన తర్వాత బియ్యం మాఫియా పెరిగింది. వ్యాన్ డ్రైవర్లు కూడా సిండికేట్లో భాగస్వాములు అయ్యారు. ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవు. జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తాం. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తాం. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. దీపం 2 పథకంలో గ్యాస్ సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలోకి బదిలీ అవుతుంది’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
తాజావార్తలు
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!