Merugu Nagarjuna: ప్రభుత్వం కృషిని జస్టిస్ బాల కిషన్ కమిటీ అభినందించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కమిటి దృష్టికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించామన్నారు మంత్రి.
Read Also: Jonnalagadda Padmavathi: పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్.. సీఎంఓ నుంచి పిలుపు..
Also Read
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
ఎస్సీలు గతంలో సామజిక అసమానతలను ఎదుర్కొనేవారని.. సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు మతం మారారని మంత్రి మేరుగ తెలిపారు. మతం మారినా.. ఎస్సీలతోనే కలిసి జీవిస్తున్నారన్నారు. ఎస్సీలకు వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. కాగా.. ప్రభుత్వం కృషిని జస్టిస్ బాల కిషన్ కమిటీ అభినందించిందని చెప్పారు. నాలుగేళ్లలో 12శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గిందని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Earthquake in Japan: జపాన్లో మరోసారి భారీ భూకంపం.. హడలిపోతున్న ప్రజలు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. చంద్రబాబు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం లేదని ఆరోపించారు. 2014లో టీడీపీతో కలిసి పని చేసిన పవన్.. తండ్రి, కొడుకులు అవినీతి పరులని చెప్పాడన్నారు. మరోవైపు.. ఈ నెల 19 న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!