Earthquake in Japan: జపాన్లో మరోసారి భారీ భూకంపం.. హడలిపోతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake in Japan: కొత్త ఏడాది వేళ జపాన్ను వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోకముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ తీరంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Lakshadweep: లక్షద్వీప్ మినికాయ్ దీవుల్లో కొత్త విమానాశ్రయం!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అంతకుముందు జనవరి 1న కూడా జపాన్లోని అదే ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించిందని, ఇది భారీ విధ్వంసానికి కారణమైందని తెలిసిందే. సరిగ్గా వారం క్రితం సంభవించిన భూకంపంలో దాదాపు 200 మంది మరణించగా.. 100 మందికి పైగా గల్లంతయ్యారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి రోజునే సెంట్రల్ జపాన్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల ధాటికి సెంట్రల్ జపాన్ పరిధిలో చాలా భవనాలు ధ్వంసం అయ్యాయి. ఎంతో మంది శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. సుమారు 3500 మంది ఇప్పటికీ జపాన్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు, ఇప్పటికీ వారికి సహాయం అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంతలో మరోసారి భూమి కంపించడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!