Mandipalli Ramprasad: అధికారులపై మంత్రి ఫైర్.. రవాణా శాఖలో ప్రక్షాళనకు ఆదేశం
- రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు
- వాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
- రవాణాశాఖ లో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం
- కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని మండిపాటు
- చెల్లించని బకాయిలు.. సమస్యల పరిష్కారంపై చర్చలు
- కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖ లో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలివెళ్లాయని మండిపడ్డారు. అక్రమంగా వెళ్తున్న వాహనాలను పట్టుకోకపోవడమేంటని ఆర్టీఎ అధికారులను ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో అక్రమంగా ఇసుక , ఖనిజాలు తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఆరా తీశారు. అక్రమంగా ఇసుక, మైన్స్ తరలింపు వాహనాలపై తప్పక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
READ MORE: Minister TG Bharath: త్వరలోనే ఓర్వకల్లు అతిపెద్ద పారిశ్రామిక హబ్గా ఏర్పడుతుంది..
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
రాష్ట్రంలో ఒకే నెంబర్ తో పలు వాహనాలు తిరుగుతున్నాయని, వాటిని పట్టుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిరంతరం తనిఖీలు చేసి అక్రమ రవాణా చేస్తోన్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ అధికారులకు సూచించారు. గత ఐదేళ్లలో రవాణా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సమూల ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. రవాణాశాఖలో అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఒవర్ లోడ్ , ఫిట్ నెస్ లేకుండా, తిరుగుతోన్న వాహనాలపై తనిఖీలు చేసి జప్తు చేయాలని ఆదేశించారు. అక్రమార్కుల పనిపట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపా పాలనలో ఆర్టీసీ లో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై అధికారులను ఆరా తీశారు.
READ MORE:Duvvada Haindavi: మా డాడీ మాకు కావాలి..
2019-24 మధ్య వైకాపా ప్రభుత్వంలో ఆర్టీసీ నిర్వీర్యమైన తీరును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిలు, సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. అమరావతి బ్రాండ్ ఎసీ బస్సులను పూర్వవైభవం తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వస్తోన్న ఆరోగ్య సమస్యలు , కల్పిస్తోన్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆర్టీసీ లో డ్రైవర్, కండక్టర్లు, సిబ్బంది కొరత ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో , బస్టాండ్ల లో పరిశుభ్రతను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని మంత్రి ఆదేశించారు. కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్బన ఉద్గారాలను నివారించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను త్వరితగతిన అందుబాటులో తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!