Minister KTR : కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారన్నారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారని, కేసీఆర్ లాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు మన బిడ్డ అనుకుంటూ ఆదరిస్తున్నారన్నారు. కేసీఆర్ కామారెడ్డి ని ఎంచుకోవడం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టమని, కామారెడ్డి నియోజకవర్గ ప్రజల దశలు మార్చేందుకు కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, కామారెడ్డి కి కేసీఆర్ వస్తుండడంతో ప్రతిపక్షాలు భూములు గుంజుకోవడానికి అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
అంతేకాకుండా.. ‘కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తాం. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు… కానీ 50 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు. కాంగ్రెస్, బీజేపీల పంచాయతీలు ఢిల్లీలో జరుగుతాయి. అలాంటి నాయకులు మనకు అవసరమా. రాష్ట్రం మొత్తం కామారెడ్డి నియోజకవర్గం వైపు చూస్తుంది. నవంబర్ 9న సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. కామారెడ్డి దెబ్బ, సత్తా రేవంత్ రెడ్డికి చూపించాలి. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కంటే షబ్బీర్ అలీ నయం. రాష్ట్రం లో నెంబర్ వన్ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి. మాస్టర్ ప్లాన్ కొత్త ప్రతిపాదన లేదు.
Also Read
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
కామారెడ్డి ప్రాంతంలో భూములు అమ్ముకోవద్దు. మూడో సారి కేసీఆర్ గెలువగానే అసెన్ భూములు హక్కులు కల్పిస్తాం. కామారెడ్డి కేసీఆర్ వస్తే చుట్టూ పక్కల నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుంది. ప్రతిదాంట్లో చిల్లర రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అమ్మగారి ఊరు కొనాపూర్ (మాశానిపల్లి)లో వందలాది ఎకరాలు ఉండేది. తల్లీ గారు ఊరు అభివృద్ధి కోసం కేసీఆర్ వస్తున్నారు తప్ప భూములు లాకోడానికి కాదు. గజ్వేల్ లో అభివృద్ధి చేశారు. కేసీఆర్ నామినేషన్ రోజు ప్రతి ఇంటి నుంచి ఒక్కరు రావాలి.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!