Minister KTR : కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారన్నారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారని, కేసీఆర్ లాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు మన బిడ్డ అనుకుంటూ ఆదరిస్తున్నారన్నారు. కేసీఆర్ కామారెడ్డి ని ఎంచుకోవడం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టమని, కామారెడ్డి నియోజకవర్గ ప్రజల దశలు మార్చేందుకు కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, కామారెడ్డి కి కేసీఆర్ వస్తుండడంతో ప్రతిపక్షాలు భూములు గుంజుకోవడానికి అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
అంతేకాకుండా.. ‘కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తాం. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు… కానీ 50 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు. కాంగ్రెస్, బీజేపీల పంచాయతీలు ఢిల్లీలో జరుగుతాయి. అలాంటి నాయకులు మనకు అవసరమా. రాష్ట్రం మొత్తం కామారెడ్డి నియోజకవర్గం వైపు చూస్తుంది. నవంబర్ 9న సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. కామారెడ్డి దెబ్బ, సత్తా రేవంత్ రెడ్డికి చూపించాలి. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కంటే షబ్బీర్ అలీ నయం. రాష్ట్రం లో నెంబర్ వన్ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి. మాస్టర్ ప్లాన్ కొత్త ప్రతిపాదన లేదు.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
కామారెడ్డి ప్రాంతంలో భూములు అమ్ముకోవద్దు. మూడో సారి కేసీఆర్ గెలువగానే అసెన్ భూములు హక్కులు కల్పిస్తాం. కామారెడ్డి కేసీఆర్ వస్తే చుట్టూ పక్కల నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుంది. ప్రతిదాంట్లో చిల్లర రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అమ్మగారి ఊరు కొనాపూర్ (మాశానిపల్లి)లో వందలాది ఎకరాలు ఉండేది. తల్లీ గారు ఊరు అభివృద్ధి కోసం కేసీఆర్ వస్తున్నారు తప్ప భూములు లాకోడానికి కాదు. గజ్వేల్ లో అభివృద్ధి చేశారు. కేసీఆర్ నామినేషన్ రోజు ప్రతి ఇంటి నుంచి ఒక్కరు రావాలి.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!