Minister KTR Vs Bandi Sanjay: దమ్ముంటే డ్రగ్స్ టెస్ట్ చేయించు… నా రక్తం.. కిడ్నీ కూడా ఇస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. నిత్యం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా వుండే మాటల యుద్ధం ఇవాళ తారస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా?పనికిమాలిన రాజకీయం వద్దు అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ని ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. డ్రగ్ టెస్ట్ చేయించాలని ఉబలాటపడుతున్న బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డ్రగ్ టెస్ట్ కోసం నా రక్తం.. కిడ్నీ కూడా ఇస్తా. ఇక్కడే ఉంటా డాక్టర్స్ ను తీసుకు రా… క్లీన్ చిట్ తో బయటికి వస్తా.. ఈ విషయంలో ఓడిపోతే.. బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటారా? అన్నారు కేటీఆర్. డ్రగ్ విమర్శలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ విధంగా ఘాటైన సమాధానం ఇచ్చారు.
Read Also:Alia Bhatt: బిడ్డకు పాలు ఇస్తూ అలియా.. ఫోటో వైరల్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
డ్రగ్స్ టెస్టుకు ఏదంటే అది ఇస్తా.. నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా.. అప్పుడు కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ చెప్పుదెబ్బలు తింటాడా..? నా రక్తం, నా చర్మం తీసుకుపోతాడా..? నా గోళ్ళు ఇస్తా…. ఏం తీసుకుపోతడో తీసుకపొమ్మను. నా వెంట్రుకలు కూడా ఇస్తా. నేను బయటకు చిత్తశుద్ధితో వచ్చిన తర్వాత కరీంనగర్ చౌరస్తాలో కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా..? నా చెప్పు దెబ్బలు కాదు.. ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకుంటాడా..? కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే నేను ఇక్కడ్నే ఉంటాను. రమ్మను. ఏ డాక్టర్ను తీసుకోస్తడో తీసుకురమ్మను.
నా వెంట్రుకలు, నా రక్తం, నా గోర్లు, అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తా. ఆయనకు ఏమైనా తెలివి ఉందా? ఇదేం రాజకీయం.. మనిషా పశువా.. కరీంనగర్కు ఏం చేసిండో చెప్పనికి చేత కాదు.. కానీ అరుపులు, పెడబొబ్బలు పెడుతుండు అని కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ప్రజలకేం చేస్తారో చేయండి. ప్రజలకు పనికివచ్చేది మాట్లాడమంటే సన్నాసి … ఫాల్తు మాటలు మాట్లాడడం ఏంటన్నారు. కరీంనగర్ కి ఏం చేశాడో చెప్పాలన్నారు. మాట్లాడితే హిందు అంటాడు. కొండగట్టు ఆంజనేయస్వామికి ఏమైనా తెచ్చావా? అని ప్రశ్నించారు కేటీఆర్.
Read Also: Population Census: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులాల వారీగా జనగణన జరగలేదు
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!