Konda Murali: ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటి.. సంచలన వ్యాఖ్యలు
- ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటి
- మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ సమర్పించారు
- నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. దీంతో ఆయే నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇంచార్జీ కి వివరణ ఇచ్చారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ సమర్పించారు.
Also Read:Chevireddy Bhaskar Reddy: జైలు వద్ద ఆగని చెవిరెడ్డి హంగామా.. మూల్యం తప్పదు అంటూ..!
Also Read
కొండా మురళి లేఖలో.. నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని.. నలభై నాలుగు ఏండ్ల నుంచి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది.. ఒకరి గురించి నేను కామెంట్ చేయను.. నాకు ప్రజాబలం ఉంది.. నాకు భయపడకపోతే నాపై 23 కేసులు పెట్టకపోయేవాళ్ళు.. పోటా, టడా కేసులకే నేను భయపడలేదు.. నాకు భయం లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను.. ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటి పరిధిలో ఉన్నది.. అయినా నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన బొంగెం కాదు అనే వ్యాఖ్యలను ఇంచార్జి దృష్టికి తీసుకెళ్లారు కొండా దంపతులు.
Also Read:Fire Accident: గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం!
కొండా మురళీ మాట్లాడుతూ.. రేపు జరగబోయే మీటింగ్ పై చర్చించాం.. రేపు వరంగల్ నుంచి ఎంత మంది వస్తారు అనేది చర్చించాం.. కాంగ్రెస్ పార్టీ నీ బ్రతికించడం నా ఉద్దేశం.. రాహుల్ గాంధీ నీ ప్రధాని చేయడం నా ఉద్దేశం.. పని చేసే వాళ్లపైనే రాళ్ళు విసురుతారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ గెలిచేలా.. ఎమ్మెల్యేలను మళ్ళీ వరంగల్ లో గెలిపించడం నా బాధ్యత.. నేను ఎవ్వడికి భయపడేది లేదు.. నేను బీసీ కార్డు పైనే బ్రతుకుతున్నాను.. రోజు 500 మంది ప్రజలకు భోజనం పెడతాను.. ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందు ఉంటాను కాబట్టి ప్రజలు వస్తున్నారు.. ఎలాంటి గ్రూప్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. నా కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదు.. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది.. మా కూతురు అనుకునేది నాకు తెలియదు.. మా కూతురు తొందర పడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకు తెలియదని అన్నారు.
Also Read:Sivaganga Custodial Death: లాకప్ డెత్ను షూట్ చేసిన వ్యక్తికి బెదిరింపులు.. డీజీపీకి ఫిర్యాదు
కొండా సురేఖ మాట్లాడుతూ.. నా కూతురు పరకాల నుంచి పోటీ చేస్తా అని చెప్పడంలో తప్పు లేదు.. టికెట్ ఆశిస్తున్నది తను.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం.. కొండా మురళీ సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు.. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకి ఉంది.. తన ఆలోచనను మేము కాదనలేం.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!