Chevireddy Bhaskar Reddy: జైలు వద్ద ఆగని చెవిరెడ్డి హంగామా.. మూల్యం తప్పదు అంటూ..!
- జైలు వద్ద ఆగని చెవిరెడ్డి హంగామా
- సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్న చెవిరెడ్డి
- ఏదొకరోజు తప్పకుండా శిక్ష పడుతుందన్న చెవిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయవాడ సబ్ జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు. ఇప్పటికే రెండు రోజులు జైలు వద్ద చెవిరెడ్డి హంగామా చేయగా.. నేడు కూడా రచ్చ చేశారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో సిట్ దర్యాప్తుపై చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అవి నిలబడవన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి ఏదొకరోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ చెవిరెడ్డి పోలీసు వ్యాన్ ఎక్కారు.
రెండోరోజు జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరుస్తూ వెళ్లారు. తప్పులు చేసే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. చెవిరెడ్డి మొదటి రోజు కూడా వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి తనను అన్యాయంగా జైలుకి పంపారని, దేవుడు అన్నీ చూస్తున్నాడన్నారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడని, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని చెవిరెడ్డి అన్నారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో మూడు రోజులు చెవిరెడ్డి హంగామా చేశారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
Also Read: Fire Accident: గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం!
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ38గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. చెవిరెడ్డిని మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించాలని ఆదేశాల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. చెవిరెడ్డిని ఈరోజు మూడో రోజు కస్టడీలోకి సిట్ అధికారులు తీసుకున్నారు. రెండు రోజుల విచారణలో చెవిరెడ్డి సహకరించలేదని సిట్ చెబుతోంది. నేటితో కస్టడీ ముగియనున్న నేపద్యంలో సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు చుస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!