Sivaganga Custodial Death: లాకప్ డెత్ను షూట్ చేసిన వ్యక్తికి బెదిరింపులు.. డీజీపీకి ఫిర్యాదు
- లాకప్ డెత్ను షూట్ చేసిన వ్యక్తికి బెదిరింపులు
- తమిళనాడు డీజీపీకి సాక్షి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఆలయ గార్డును పోలీసులు చితకకొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విపక్ష పార్టీలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొట్టి చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
ఇది కూడా చదవండి: Bollywood : ప్రైవేట్ ఆల్బమ్స్ తో నెట్టుకొస్తున్న హాట్ బ్యూటీ
Also Read
తాజాగా ఆలయ గార్డు అజిత్ కుమార్ను పోలీసులు కొడుతున్న దృశ్యాలను రహస్యంగా శక్తిశ్వరన్ అనే వ్యక్తి మొబైల్లో చిత్రీకరించాడు. ఈ కేసులో కీలక సాక్షి అతడే. ప్రస్తుతం అతనికి బెదిరింపులు మొదలయ్యాయి. చంపేస్తామంటూ బెదిరిస్తు్న్నారు. దీంతో బాధితుడు.. తనకు రక్షణ కల్పించాలంటూ తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్కు రెండు పేజీల లేఖ రాశాడు. నిందితులు చాలా శక్తిమంతులని.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.
ఇది కూడా చదవండి: Rainy Season Laundry Tips: వర్షాకాలంలో తడి బట్టల దుర్వాసన ఎలా పోగొట్టాలి? ఈ సింపుల్ చిట్కాలు మీకోసం!
జూన్ 28న ఆభరణాల దొంగతనం కేసులో శివగంగ పోలీసులు విచారణ కోసం 27 ఏళ్ల అజిత్ కుమార్ అనే ఆలయ గార్డును తీసుకెళ్లారు. అయితే విచారణ పేరుతో ఐదుగురు పోలీసులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రహస్యంగా ఒకరు చిత్రీకరించారు. అలాగే కుటుంబ సభ్యుల్ని కూడా పిలిచి వారిపై కూడా ఇలాగే ప్రతాపం చూపించారు. అజిత్ కుమార్ సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరుడి నోట్లో.. ఒంటిపై కారం చల్లి చితకబాదారని వాపోయాడు. స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పాడు.
ఇక ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు కూడా సీరియస్ అయింది. శవపరీక్షలో కూడా అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నట్లుగా తేలింది. చెవులు, నోటిలో కారం పొడి చల్లినట్లు కనిపించింది. ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసినట్లుగా ఎలా చేస్తారని కోర్టు నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పౌరుడిని చంపేసిందని వ్యాఖ్యానించింది. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించద్దని న్యాయస్థానం మండిపడింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు బదిలీ చేసింది. అంతేకాకుండా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇక స్టాలిన్ స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సారీ చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!