Harish Rao : మన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిమ్స్, ఎంఎన్ జే ఆసుపత్రుల పనితీరుపై MCRHRD నుండి జూమ్ ద్వారా ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పిల్లల్లో జన్యులోపాలు నివారించేలా ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలి, నివేదిక ఇవ్వాలన్నారు. ఈ మేరకు నిమ్స్ జెనిటిక్స్ విభాగం, జేడి మేటర్నల్ హెల్త్ కు ఆదేశాలు జారీ చేశారు హరీష్ రావు. ఓపీ పెరుగుదలకు అనుగుణంగా కౌంటర్లు పెంచాలని, ఈఎండీలో బెడ్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాలని, ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షలు ఇస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవయవదానంపై అవగాహన పెంచాలని, బ్రెయిన్ డెడ్ నిర్ధారణ కేసుల్లో అవయవదానం చేసేలా ప్రోత్సహించాలన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. అవసరం అయితే నేను కూడా స్వయంగా ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించేందుకు సిద్దమన్నారు హరీష్ రావు. ‘నిమ్స్ అధ్వర్యంలో స్పోక్ మోడల్ లో వివిధ జిల్లాల్లో ఉన్న డయాలసిస్ సెంటర్లను మానిటరింగ్ చేయాలి. సమస్యలు లేకుండా చూడాలన్నారు.
Also Read : Ajay Kallam: గడువులోగా సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి..
ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రిలో 300 పడకల కొత్త బ్లాక్ వచ్చే వారంలో ప్రారంభిస్తాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్కోవాలి. ఇది అందుబాటులోకి వస్తే మొత్తం 750 పడకలు కేన్సర్ చికిత్స కోసం అందుబాటులో ఉంటాయి. పాలియేటివ్ సేవల గురించి అవగాహన కల్పించి, ఎక్కువ మందికి సేవలు అందేలా చూడాలి. మొబైల్ స్క్రీనింగ్ బస్ ద్వారా నిర్వహించే క్యాంపుల సంఖ్య పెంచాలి. మారుమూల ప్రాంతాల్లోనూ వీటిని నిర్వహించాలి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం కేసీఆర్ గారు మనకు అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నారు. అడిగిన అన్ని ఇస్తున్నారు. మన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేద్దాం. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడం, వారిని బాగా చూసుకోవడం మన బాధ్యత. పేషెంట్లు, వారి సంబంధీకులతో సెక్యూరిటీ, నాల్గవ తరగతి ఉద్యోగులు గౌరవంగా మెలగాలి.’ అని ఆయన వెల్లడించారు.
Also Read
- FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
- Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- ICC Women's T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
తాజావార్తలు
-
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
-
RBI New Rules: ఇక బ్యాంకుల దౌర్జన్యానికి చెక్.. ఆర్బీఐ న్యూ రూల్స్.. బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట
-
Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
-
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
-
Prabhas : రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్ధమవండి!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!