Harish Rao: అందుకే నిధులు ఇవ్వట్లేదని ఆర్థిక మంత్రే ఒప్పుకుంది.. హరీశ్ రావు కామెంట్స్
Harish Rao Counter To BJP, Congress: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే నిధులు ఇవ్వలేదని చెప్పారు.. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు గతంలో అసత్యాలు మాట్లాడారు.. ముక్కు నేలకు రాస్తానని ఒకరు, రాజీనామా చేస్తానని మరొకరు మాట్లాడారు.. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులవి అబద్దాలు, అదరగొట్టే మాటలే ఉంటాయి.. కాంగ్రెస్ బండారం బట్టబయలు చేసింది నిర్మలాసీతారామన్ అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యనించారు.
Read Also: Bollywood: ఒక్క డిసెంబర్ నెలలోనే మూడు సినిమాలు 2500 కోట్ల బిజినెస్…
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ మోటర్లకు మీటర్లు పెడుతున్నారన్న విషయం నిర్మలా సీతారామన్ చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోయి ఉంటే మోటార్లకు మీటర్లు పెట్టేవారు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లేకుండా చేసే కుట్ర బీజేపీ చేస్తోంది.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కూడా మీటర్లు పెడుతామని డబ్బు తెచ్చుకుంది అని ఆయన ఆరోపించారు. నిన్న- మొన్నా కర్ణాటకలో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా మీటర్లు పెట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసింది.. మీటర్లు కావాలంటే కాంగ్రెస్, బీజేపీలకు.. వద్దనుకుంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: Amelia Kerr Towel: టవల్తో బంతిని ఆపింది.. భారీ మూల్యం చెల్లించుకుంది! వీడియో వైరల్
స్వామినాథన్ కమిషన్ రిపోర్టును తుంగలో తొక్కింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తాము గెలవగానే అమలు చేస్తామన్న బీజేపీ ఇప్పటికీ అమలు చేయడం లేదు.. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే అంటూ మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు అని ఆయన ఆరోపించారు. సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా.. ఎవరు వస్తరో రండి.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే.. కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో బావులకి మీటర్లు పెడుతున్నారంటూ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ చేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో