Minister Dadisetti Raja: పవన్ను సీఎం కాదు.. ఎమ్మెల్యేను చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు
Minister Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా.. తాను సీఎంను కావడానికి సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించిన పవన్.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న నేపథ్యంలో.. పవన్పై కౌంటర్ ఎటాక్కు దిగారు దాడిశెట్టి.. పవన్ ను ఆ పార్టీ నేతలు మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు.. గంటకో విధంగా.. పూటకో రకంగా పవన్ మాట్లాడుతున్నారు. అసలు ఆయన సభలకు జనం రావడం లేదన్నారు.. ఈ సభలతో పవన్ నవ్వులపాలవుతున్నారని.. పవన్ను సీఎం కాదు గదా.. ఎమ్మెల్యేను చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు దాడిశెట్టి రాజా.. ఇక, పేర్నినాని ఇంట్లో చెప్పులు, డ్రాయర్లు, లుంగీలు పోయాయని ఆయన మనుషులు చెబుతున్నారని సెటైర్లు వేశారు.. చెప్పులు, లుంగీలు, లుంగీలతో ఎవరైనా కనిపిస్తే.. మచిలీపట్నంలో అప్పగించాలంటూ ఎద్దేవా చేశారు.. తాను మంచి చేశానని భావిస్తేనే సీఎం జగన్ ఓటు వేయమంటున్నారు. అలా చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్కు ఉందా?. అని ప్రశ్నించారు మంత్రి దాడిశెట్టి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ రెండు సభలు ప్లాప్ అయ్యాయి. ఎక్కడి పోటీ చేస్తాడో పవన్కే క్లారిటీ లేదు. నవ్వు సీఎం అయిపోవాలనుకుంటే అయిపోవు.. ప్రజలు మద్దతిస్తేనే అవుతావు అని హితవుపలికారు.
Also Read
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ఇక, 2014-19లో టీడీపీ, పవన్, బీజేపీ కలిసి మేనిఫెస్టో రూపొందించారు. మేనిఫెస్టో హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును నిలదీశావా పవన్ కల్యాణ్ అంటూ దుయ్యబట్టారు దాడిశెట్టి రాజా.. పవన్ సభలకు జనం రావడం లేదు.. 2వేలు, 5వేల మంది వరకే వస్తున్నారు.. ఇలా తక్కువ మంది జనం వస్తే.. నీ యజమాని దగ్గర (చంద్రబాబు) మాట వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ నేరాలు చూసినా పచ్చ పార్టీ మూలాలే బయటపడుతున్నాయి.. అసలు పవన్ మాటలు సంస్కారహీనం అన్నారు. పవన్ను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైక్రియాటిస్ట్కు చూపించాలి. చంద్రబాబు ప్యాకేజీ సరిగా ఇవ్వడేమోనని అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నావు. టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలను కూల్చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? అంటూ నిలదీశారు మంత్రి దాడిశెట్టి రాజా..
తాజావార్తలు
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?