Minister Venugopalakrishna: గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Venugopalakrishna: రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన ప్రక్రియ ప్రారంభించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని నేలపర్తిపాడు గ్రామంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదన్నారు. బీహార్లో కులగణన జరిగినా ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైందని. వివరించారు.కులగణన ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఎంతోమంది కుల సంఘాల ప్రతినిధులు గత పాలకులను అడిగిన కులగణన చేపట్టలేదని.తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధి కోసమే సమగ్ర కుల గణన చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని అన్నారు.
Also Read: MLA Nimmala Ramanaidu Arrest: వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఆందోళన.. పాలకొల్లులో టెన్షన్ టెన్షన్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రామచంద్రాపురం మండలం నేలపర్తిపాడు లో పైలెట్ ప్రాజెక్టుగా కులగణన ప్రారంభించడంపై సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని. అన్నారు. స్వాతంత్రం రాకపూర్వం కుల గణన జరిగిందని, స్వాతంత్ర వచ్చిన తర్వాత జనాభా గణన జరిగింది, తప్ప కులగనన జరగలేదన్నారు. కుల గణన చేపట్టాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన జరగలేదన్నారు.బీసీ కులాల మనోవభావాలను పరిగణలోనికి తీసుకొని వారికి న్యాయం జరగాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయంతో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా కులగననకు నాంది పలికారన్నారు.
Also Read: Balka Suman: చెన్నూరులో వివేక్ డబ్బులు పంచుతున్నారు.. బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు
సమాజంలో అగ్రకులాల వారితో సమానంగా బ్రతుకుతున్న వారితో పాటు కొన్ని కులాల వారికి సమాన గౌరవం దక్కటం లేదనే కారణంతో కులగననకు నాంది అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి కనీస అవసరాలు కల్పించి, వారు సుఖంగా జీవించాలని కోరుకున్నారన్నారు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా గ్రామ స్వపరిపాలన ఉండాలని మహాత్మా గాంధీ ఆకాంక్షించారన్నారు. మహిళలు చదువుకోవాలని ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే -వారిని ఆదర్శంగా తీసుకొని మహిళలకు సముచిత గౌరవం దక్కే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని , రాష్ట్రంలో జరుగుతున్న పనితీరును మంత్రి వివరించారు. పేదరికంలో మగ్గుతున్న, పేదరికం శాపంగా భావిస్తున్న ఆయా వర్గాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో కులగనలను చేపట్టడం అందులో భాగంగా రామచంద్రపురం నియోజవర్గం లోని నేలపార్తిపాడు గ్రామంలో చేపట్టడం బీసీ మంత్రిగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!