Chandrabau-Pawan Kalyan: చంద్రబాబుది డైరెక్షన్.. పవన్ది యాక్షన్: మంత్రి వేణుగోపాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్ది యాక్షన్ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి చెప్పుకొచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాలో నేడు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడు. చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్ది యాక్షన్. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారు. నాకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ కళ్యాణ్ ఒక జాతిని అవమానించినట్లే. పవన్ కళ్యాణ్కి స్వేచ్ఛ లేదు. నిన్న జరిగిన జెండాని సభకి జెండా లేదు’ అని అన్నారు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
Also Read: YS Jagan: రైతులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టకున్నారు: మంత్రి కాకాణి
‘ఇన్ని రోజులూ పవన్ కళ్యాణ్కు పిచ్చి, ఉన్మాదం ఉందనుకున్నా. ఆయన మాటలు చూస్తే.. ఆ పరిధి దాటినట్లుంది. ఆశించిన మేర ప్రజలు రాకపోవడంతో అసహనానికి గురైనట్లు కనిపించారు. నేను పిచ్చోడిని, నన్ను నమ్మి ఓట్లు వేయవద్దని చెప్పేందుకు పవన్ వచ్చినట్లుంది. చంద్రబాబు వామానావతరం ఎత్తి కళ్యాణ్ను తొక్కారు. పవన్ కూడా ఆ అవతారం ఎత్తి.. నమ్ముకున్న నేతలు, కార్యకర్తలను తొక్కారు. జెండా సభ ఫ్లాఫ్ అయింది. 6 లక్షల మంది వస్తారన్నారు, 10 శాతం కూడా రాలేదు. జెండా సభ రెండు సామాజిక వర్గాలు పెట్టిన సభగా ఉంది. తెలుగుదేశం జెండాను మోయడమే పవన్ లక్ష్యమా?’ అని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!