YS Jagan: రైతులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టకున్నారు: మంత్రి కాకాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఎన్నికలలోల్లో రైతులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టకున్నారు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఐదేళ్ల పాటూ రైతులకు రైతు భరోసాను చెప్పినదానికంటే అధికంగా ఇచ్చారన్నారు. ఐదేళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపై పుస్తకాన్ని విడుదల చేశాం అని ఆయన తెలిపారు. రైతులపై భీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించిందని, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి కాకాణి చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 30 శాతం అధికంగా ఇచ్చామని చెప్పుకొచ్చారు.
నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టకున్నారు. వరుసగా ఐదేళ్ల పాటూ రైతులకు రైతు భరోసాను చెప్పినదానికంటే అధికంగా ఇచ్చారు. పీఎం కిసాన్, రైతు భరోసాను సున్నా వడ్డీకి అందించారు. ఐదేళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపై పుస్తకాన్ని విడుదల చేశాం. రైతులపై భీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం కొనుగోళ్ల లో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 30 శాతం అధికంగా ఇచ్చాం. ఉచిత విద్యుత్ కు సంబందించిన బకాయిలను చంద్రబాబు ఇవ్వలేదు. జగన్ వచ్చిన తర్వాతే బకాయిలను చెల్లించాం’ అని అన్నారు.
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
Also Read: Mudragada Padmanabham: 80 అసెంబ్లీ సీట్లు, సీఎం పదవి అడగాల్సింది.. పవన్ కళ్యాణ్కు ముద్రగడ లేఖ!
‘రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని మేం గర్వంగా చెబుతున్నాం. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కోటయ్య కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫార్సులను కూడా అమలు చేయలేదు. సంపూర్ణ రుణ మాఫీ చేయకుండా ఐదు విడతల్లో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. చంద్రబాబు విధానాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది’ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!