Botsa Satyanarayana: తల్లిదండ్రులు అధైర్యపడొద్దు.. 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana: మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఎన్ఐటీలలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు వచ్చేస్తామన్నారని.. ఈ విషయమై ముఖ్యమంత్రితో మేమంతా సంప్రదింపులు చేస్తూ.. రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే హెల్ లైన్ ఏర్పాటు చేశామని.. ఎవ్వరున్నా తమకు సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. విద్యార్థులను అందరినీ వెనక్కి తీసుకొస్తామని.. తల్లిదండ్రులు అధైర్యపడొద్దని మంత్రి చెప్పారు. తొలుత 150 మందిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాట్లు చేయడం వల్ల ఆలస్యం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.
Read Also: Alluri Sitarama Raju: అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలి
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
వర్షాల కారణంగా పంట నష్టం పెద్దగా ఏమీ లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పార్వతీపురంలో అరటి పంటకు కాస్త నష్టం జరిగిందన్నారు. మొక్కజొన్న రైతులు అక్కడక్కడా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు క్షేత్ర స్థాయిలో అంచనాలు వేస్తున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు రైతులను పట్టించకోవడం లేదని చెబుతున్నారని.. ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా చూసుకుంటోందన్నారు. రైతుల ఆవేదన సీఎంవో దృష్టికి వచ్చిన వెంటనే సీఎం స్పందించారని.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు జిల్లాలకు వచ్చి పరిశీలిస్తున్నారని మంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!