Minister Botsa: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్నది అనైతిక రాజకీయం కాదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని భీమిలిలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అధికారం కొంత మంది చేతుల్లోనే ఉందన్న ప్రతిపక్షాల విమర్శలు అర్థ రహితం అంటూ ఆయన మండిపడ్డారు. బీసీ మంత్రులమైన మాకు వ్యక్తిత్వం లేదా? ఆత్మాభిమానం లేదని ప్రతిపక్షాలు చెప్పదలచుకున్నాయా?.. చంద్రబాబు ప్రభుత్వం కంటే గౌరవంగా, ఆత్మాభిమానంతో మంత్రులుగా మా విధులను నిర్వర్తిస్తూ ఉన్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వేసుకున్న ముసుగులు తీసి వేసి చేస్తున్నది అనైతిక రాజకీయం కాదా? అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
Read Also: Health Tips: ముక్కు దిబ్బడ నివారణకు ఆయుర్వేద నివారణలు..!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
తమ ప్రభుత్వం పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. .ఇదేమీ కొత్త కాదు.. పరిమితులు దాటితే కేంద్ర ప్రభుత్వమే అంగీకరించదు అని ఆయన తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ 600 హామీలు ఇచ్చింది.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 ఫైళ్లపై సంతకం చేశారు.. వాటిలో ఒకటైన నెరవేర్చరా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ముసుగులు తొలగించుకుని మళ్లీ జనం ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిందితుడు.. బలహీన వర్గాలకు చెందిన మంత్రులుగా మాకు వ్యక్తిత్వాలు లేవా, మేమే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చామా? అంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Hyderabad Crime: హైదరాబాద్ లో యువతి దారుణ హత్య..
కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు కొన్ని పత్రికలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏరు దాటే వరకు ఓడమల్లన్నా.. ఏరు దాటాక బోడి మల్లన్న అనేది టీడీపీ పాలన జరిగిన తీరు.. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులుగా ప్రజల ముందుకు వచ్చాము అని ఆయన పేర్కొన్నారు. రెండు వంతుల మందికి పాలనలో భాగస్వామ్యం కల్పించింది వైసీపీ ప్రభుత్వం అని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!